టాలీవుడ్ సూపర్ స్టార్
మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరూ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యువ దర్శకుడు
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను
మహేష్, దిల్ రాజు,
అనిల్ సుంకర కలిసి ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఫస్ట్ ఇంట్రో టీజర్ మరియు రెండు పోస్టర్స్ మినహా ఈ సినిమా నుండి మరొక అప్ డేట్ లేకపోవడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ దీపావళికి ఏదైనా సర్ప్రైజ్ అప్ డేట్ ఉంటుందేమో అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక నిన్న ఈ సినిమా దర్శకుడు
అనిల్ రావిపూడి తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఈ సినిమా నుండి
దీపావళి స్పెషల్ సర్ప్రైజ్ ఒకటి ఉందని పోస్ట్ చేయడంతో
మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అయితే అది పోస్టరా లేక సాంగ్ టీజరా అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ని దీపావళికి రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే స్టైలిష్ స్టార్
అల్లు అర్జున్ హీరోగా
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నిజానికి సరిలేరు నీకెవ్వరు తో పాటు జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా తాలూకు ప్రమోషన్స్ ఇప్పటికే ఫుల్ స్వింగ్ లో సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఒక సాంగ్ రిలీజ్ చేసిన సినిమా యూనిట్, నేడు రెండవ సాంగ్ వీడియో ప్రోమోని రిలీజ్ చేసింది.
తెలంగాణ యాసలో సాగె రాములో రాములా అనే పల్లవితో సాగె ఈ సాంగ్ ప్రోమోకు ఇప్పటికే శ్రోతల నుండి మంచి స్పందన లభించింది. ఇక దీని ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ ని
దీపావళి కానుకగా రిలీజ్ చేయబోతోంది సినిమా యూనిట్. బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సో రాబోయే దీపావళికి ఈ రెండు సినిమాలు కూడా పోటాపోటీగా తమ ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇవ్వడానికి సిద్దమయ్యాయని తెలుస్తోంది.....!!