ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 గెటప్స్ తో ప్రేక్షకులను అలరించబోతున్నాడు చియాన్ విక్రమ్. ఈ న్యూస్ గత కొన్ని రోజులుగా కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది.
ప్రియాంక చోప్రా 'వాటీజ్ యువర్ రాశీ' అనే సినిమాలో ఈ 12 గెటప్పులు వేసి మెప్పించింది. దశావతారం సినిమాలో
కమల్ హాసన్ 10 గెటప్పులలో ప్రేక్షకులను ఆకట్టుకోగా తమిళ స్టార్ హీరో శివాజీ గణేషన్ నటించిన క్లాసిక్ సినిమా
నవరాత్రి లో 9 గెటప్పులు వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీళ్లందరి రికార్డ్ ను బ్రేక్ చేస్తు
విక్రమ్ ఏకంగా 25 పాత్రల్లో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం 58వ సినిమాలో 25 గెటప్పుల్లో అదరగొట్టబోతున్న
విక్రమ్ సినిమాని 7 స్క్రీన్ స్టూడియోస్- వియాకామ్ 18స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో
విక్రమ్ సరసన
ప్రియా భవానీ
శంకర్ కథానాయికగా నటిస్తోంది. ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే
విక్రమ్ కొడుకు ధృవ్
విక్రమ్ నటించిన అర్జున్ రెడ్డి తమిళ రీమేక్
ఆదిత్య వర్మ ఆడియో లాంచ్ ను ఘనంగా నిర్వహించారు. అంతేకాదు
ఆదిత్య వర్మ సినిమా ఆడియో లాంచ్ వేదికగా ఆ చిత్ర నిర్మాత భారీ ప్రకటన చేసి హీరోల తో పాటు అందరికి భారీ షాకిచ్చాడు. నటుడు విక్రమ్.. తన కుమారుడు ధృవ్
విక్రమ్ లతో వచ్చే ఏడాది ఓ భారీ మల్టీ స్టారర్ ఉంటుందని ప్రకటించి అందరిని ఆశ్చర్య పరిచారు. అర్జున్ రెడ్డి తమిళ రీమేక్
ఆదిత్య వర్మ సినిమాతో ధృవ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్గా ఈ మూవీ ఆడియో లాంచ్ వేడుక చెన్నైలో జరిగింది.
కాగా ఈఫోర్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత
ముఖేష్ మెహతా వచ్చే 2021-22 సంవత్సరంలో
విక్రమ్,ధృవ్ హీరోలుగా ఓ భారీ సినిమా చేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా సినిమా హై బడ్జెట్ రేంజ్ లో ఉంటుందని తెలిపారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిన
ఆదిత్య వర్మ సినిమా వచ్చే నెల 8న విడుదల కానుంది. బనిత సంధు,ప్రియా
ఆనంద్ హీరోయిన్స్ గా నటించగా గిరీశాయ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక
విక్రమ్ ధ్రువ నక్షత్రం, పొన్నియిన్ సెల్వం తో పాటు మరి కొన్ని సినిమాలలో నటించనున్నారు. ఇక విక్రమ్.. కొడుకుతో కలిసి నటించబోతున్నాడనగానే ఫ్యాన్స్ లో ఆనందం మామూలుగా లేదట.