టాలీవుడ్ లో ఒక సంచలనం అర్జున్ రెడ్డి సినిమా. హీరో గా విజయ్ దేరకొండ డైరెక్టర్ గా సందీప్ రెడ్డి వంగా ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. కానీ ఈ సినిమాకోసం ఈ ఇద్దరు ఎంత కష్టపడ్డారో ఎవరికి తెలీదు. ఇక ఈ సినిమా హిందీ తో పాటు తమిళ దర్శక, నిర్మాతలు కూడా మనసు పారేసుకున్నారు. అందుకే హిందీలో ఇదే సినిమాని షాహిద్ కపూర్, కియారా అద్వానీ లతో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు సందీప్. ఇక ఇదే సినిమాని తమిళంలోను రీమేక్ చేశారు. 

చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ ను హీరోగా పరిచయం అవుతున్న తమిళ సినిమా 'అదిత్య వర్మ'. 'అర్జున్ రెడ్డి' కి రీమేక్ గా ఈ సినిమాని గిరీశాయ తెరకెక్కించాడు. ముందు ఈ సినిమాను 'వర్మ' పేరుతో బాలా దర్శకత్వంలో తెరకెక్కించారు. ఆ సినిమా టీజర్ కూడా రిలీజ్ అయింది. అయితే నిర్మాతలు కూడా 'అవుట్ పుట్ అనుకున్నట్టు రాలేదనే' ఉద్దేశంతో ఆ సినిమాను స్క్రాప్ చేసి కొత్తగా 'అర్జున్ రెడ్డి' సినిమాకు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పని చేసిన గిరీశాయ కు దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చారు. 'ఆదిత్య వర్మ' టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా విడుదల చేశారు. విజయ్ దేవరకొండతో ధృవ్ ను పోల్చి చూడకుండా.. అర్జున్ రెడ్డి ట్రైలర్ తో ఈ ట్రైలర్ ను కంపేర్ చేయకుండా ఒక ఫ్రెష్ మైండ్ సెట్ తో చూస్తే మాత్రం 'ఆదిత్య వర్మ' ట్రైలర్ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పటికే ఈ ట్రైలర్ కోలీవుడ్ లో చాలామందిని ఆకట్టుకుంటుంది కూడా. 

ఇక ఈ సినిమా ఇంటెన్సిటీకి తగ్గట్టుగా ధృవ్ బాడీ లాంగ్వేజ్ ను చూపించగలగడంలో మాత్రం దర్శకుడు సక్సెస్ అయ్యాడనే ఫీల్ కలుగుతుంది. ట్రైలర్ ఎండ్ లో ధృవ్ తన చేతిలో బాటిల్ ను షేక్ చేసే సీన్ ఒక్కటి చూస్తే అర్థమవుతుంది ధృవ్ ను కరెక్ట్ గా ప్రెజెంట్ చేశాడని చెప్పడానికి.  ఇక ట్రైలర్ లో లాస్ట్ వన్ మినిట్ సిడ్ శ్రీరాం పాడిన మెలోడీని బ్యాక్ గ్రౌండ్ లో ప్లే చేయడంతో ట్రైలర్ కి బాగా అట్రాక్షన్ యాడ్ అయింది. ఇక ధృవ్ కు ఇది మంచి లాంచ్ ప్యాడ్ అయ్యే అవకాశం ఉందని కోలీవుడ్ లో విక్రమ్ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: