టాలీవుడ్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.
మహేష్ సరసన
రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ
సినిమా ద్వారా చాలా ఏళ్ల తరువాత సీనియర్ నటి
విజయశాంతి టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్నారు. సినిమాలతో పాటు ఇప్పటికే పలు ప్రముఖ బ్రాడింగ్లకు ఆయన ప్రచార కర్తగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు సౌత్ లో అత్యధిక బ్రాండ్స్ కి అంబాసడర్ గా వ్యవహరిస్తున్న హీరో
మహేష్ బాబే.
తొలిసారి తన ఫ్యామిలీతో కలిసి
మహేష్ ఒక
టెలివిజన్ కమర్షియల్ యాడ్ లో నటించడం జరిగింది.వాస్తవానికి తన సినిమాలతో పాటు ఫ్యామిలీ సంగతులు కూడా తన సోషల్
మీడియా అకౌంట్స్ ద్వారా షేర్ చేసే
మహేష్ బాబు, నేడు తన ఫ్యామిలీ తో కలిసి నటించిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒకటైన సాయి సూర్య డెవలపర్స్ వారి లేటెస్ట్ యాడ్ ని తన అఫీషియల్ యూట్యూబ్ లో ఛానల్ లో పోస్ట్ చేయడంతో పాటు, ఆ యాడ్ లో నటించడం నిజంగా ఎంతో హ్యాపీగా ఉందని, మొట్టమొదటిసారి మా ఫ్యామిలీ మొత్తం కలిసి నటించిన ఈ యాడ్ నాకు ఎంతో ప్రత్యేకమని
మహేష్ తన ట్విట్టర్ ద్వారా ఒక పోస్ట్ కూడా పెట్టారు.
ఇక ప్రస్తుతం ఆ యాడ్ పలు సోషల్
మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. అంతేకాకాదు యూట్యూబ్ లో కూడా మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. కాగా
మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు
సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ, రాబోయే
సంక్రాంతి కానుకగా
జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే
భరత్ అనే నేను,
మహర్షి సినిమాలతో వరుసగా రెండు సక్సెస్ లు కొట్టిన
సూపర్ స్టార్, సరిలేరుతో తప్పకుండా హ్యటిక్ హిట్ కొడతారని సూపర్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఎంతవరకు జరుగుతుందో చూడాలి....!!