టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ మూవీ దర్శకుడు krishna KUMAR' target='_blank' title='రాధాకృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. గోపి కృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన టాలీవుడ్ గోల్డెన్ లెగ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక మొన్నటితో తన 40వ ఏట అడుగుపెట్టిన ప్రభాస్, ఇకపై త్వరితగతిన సినిమాలు చేస్తూ ముందుకు సాగాలని నిర్ణయించినట్లు సమాచారం. 

మొదటి నుండి తనకు ఎంతో అండగా నిలుస్తున్న తన పెదనాన్న కృష్ణంరాజు గారికి మరియు ఆయన ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా ప్రభాస్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పినట్లు సమాచారం. ఇకపోతే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాను ఇటీవల లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ప్రత్యేకంగా ప్రదర్శించడంతో, ప్రభాస్ తో కలిసి ఆ సినిమా యూనిట్ సభ్యులు కొందరు కూడా ఆ షోను వీక్షించడం జరిగింది. అయితే ఆ షో నిర్వహిస్తున్న సందర్భంగా బాహుబలి టీమ్ అక్కడి మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇక హీరో ప్రభాస్ కూడా బాహుబలి సినిమా అనుభవాలని మీడియాతో పంచుకున్నారు. అందులో భాగంగా ఒక ఆంగ్ల పత్రికతో ప్రత్యేకంగా ముచ్చటించిన ప్రభాస్, తనకు ఎంతో గుర్తింపునిచ్చిన బాహుబలి సినిమాను అందించిన రాజమౌళి గారిని ఎప్పటికీ మరువలేనని అన్నారు. 

ఇక ఉత్తర భారత దేశంలో బాహుబలి మాదిరి మరేవైనా తెలుగు సినిమాలు ఇంతటి గొప్ప ఖ్యాతిని గడించాయా అని అడుగగా, గడచిన గత 30 ఏళ్లలో మా దేశంలో కొన్ని చిత్రాలు ఎంతో పేరు సంపాదించాయని, అయితే వాటిలో అప్పట్లో రాంగోపాల్ వర్మ గారి దర్శకత్వంలో నాగార్జున గారు హీరోగా నటించిన 'శివ' సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదని, ఆ సినిమాపై షాకింగ్ రేంజ్ లో పొగడ్తలు కురిపించినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం ప్రభాస్ చేసిన ఆ వ్యాఖ్యలు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: