సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపుడి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు, అనీల్ సుంకర కలిసి నిర్మిస్తున్న ఈ మూవీలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడని తెలిసిందే. 


ఆల్రెడీ అనీల్ రావిపుడితో దేవి శ్రీ ప్రసాద్ ఎఫ్-2 సినిమాకు పనిచేశాడు. హిట్టు కాంబినేషన్ కాబట్టి మహేష్ కోసం మరోసారి కలిసి పనిచేస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం దేవి శ్రీని ఎంపిక చేయడంలో మహేష్ ఇన్వాల్వ్ మెంట్ కూడా ఎక్కువగా ఉందని తెలుస్తుంది. మహేష్ కు శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో హిట్ మ్యూజిక్ ఇచ్చాడు దేవి శ్రీ ప్రసాద్ అందుకే ఈ సినిమాకు అతనే కావాలని అన్నాడట మహేష్.


అయితే దేవి ఇస్తున్న మ్యూజిక్ కు అనీల్ శాటిస్ఫై అవ్వట్లేదని టాక్. ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వస్తున్నాయని లేటెస్ట్ టాక్. ఈ వార్తల్లో ఎంత వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. ఈమధ్య దేవి తన మార్క్ చూపించే మ్యూజిక్ ఇవ్వట్లేదని అందరు అంటున్న మాటే. సరిలేరు నీకెవ్వరు కోసం మాత్రం డిఎస్పి మరోసారి తన సత్తా చాటుతాడని అంటున్నారు. 


మహేష్, రష్మిక ఇద్దరు మొదటిసారి జోడీ కడుతున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ కూడా మరో హైలెట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటిస్తుంది. దీవాళికి సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ లుక్ టీజర్ వస్తుందని అంటున్నారు. 2020 సంకాంతి బరిలో ఈ మూవీ రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు పోటీగా అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా రిలీజ్ అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: