తెలుగు లో వస్తున్న
బిగ్ బాస్ 3 షో మరో పది రోజులు మాత్రమే ఉంది. అక్కినేని నాగార్జున హూస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా కూల్ గా సాగుతుంది. ఇంటి సభ్యుల మద్య అప్పుడప్పుడు చిన్న చిన్న తగాదాల మినహా గతంలో మారిది కాంట్రవర్సీలు రాలేదు.
బిగ్ బాస్ 50 రోజులు పూర్తి అయిన తర్వాత రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం
బిగ్ బాస్ 3 లో
శ్రీముఖి,అలీ రెజా,శివజ్యోతి,బాబా
భాస్కర్,రాహూల్,
వరుణ్ తేజ్ ఉన్నారు.
మొన్న జరిగిన బ్యాటరీ ఎనర్జీ టాస్క్ లో రాహూల్ డైరెక్ట్ గా టికెట్ టు ఫినాలేను దక్కించుకొని ప్రశాంతంగా ఉన్నాడు. అలాగే
బాబా భాస్కర్,అలీ రెజా మద్య దాదాపు మ్యాన్ హ్యాండిలింగ్ కే దారితిసింది..కాకపోతే తర్వాత ఇద్దరూ కలిసిపోయారు. ఇక .
బిగ్ బాస్ హౌజ్లో టాప్ ఫైవ్లో ఉండటానికి మిగతా కంటెస్టెంట్స్ పడుతున్న కష్టాలను చూస్తూ.. ఎంజాయ్ చేస్తున్నాడు. మిగితా సభ్యులు టాప్ ఫైవ్లో ఉండాలని ఫైనల్ కి అర్హత సాధించాలని శక్తిమేర ప్రయత్నిస్తున్నారు.
ఇక రేపు శనివారం
కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అన్న చెబుతారు..దానిపై ఈసారి ఐదుగురు కంటిస్టెంట్ టెన్షన్ లో ఉన్నారు.
మరోవైపు
రాహుల్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. కావున మిగిలిన ఐదుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తిగా మారింది. కాగా ఈరోజు విడుదలైన
బిగ్ బాస్ ప్రోమో ప్రకారం... ఒక్క రాహుల్ను తప్ప అందర్నీ బ్యాగులు సర్దుకోమని చెప్పాడు బిగ్ బాస్. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్న ఇంటి సభ్యులు నోరెళ్ల పెడుతూ బ్యాగులు సర్దేస్తున్నారు. మరి ఈరోజు ఏం జరగబోతుంది..ఐదుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ ప్రోమో చూసిన నెటిజన్స్.. అసలు
బిగ్ బాస్ హౌజ్లో ఈరోజు ఏం జరుగుతుందని తెగ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.