టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే.  గతంలో ఆయన కామెడీ, మాఫియా, హర్రర్ సినిమాలు తీస్తూ మంచి క్రేజ్ సంపాదించారు.  ఇటీవల కాలంలో వర్మకు ఏదీ పెద్దగా కలిసి రావడం లేదు. తెలుగులో రక్త చరిత్ర తర్వాత ఆ స్థాయి హిట్ మళ్లీ అందుకోలేకపోయారు రాంగోపాల్ వర్మ. ఇక సినిమాల సంగతి ఎలా ఉన్న తన ట్విట్టర్ తో ఏదో ఒక విషయంపై సంచలనం సృష్టిస్తున్నారు.

ఆ మద్య ఏపిలో ఎన్నికల సమయంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీతో తెగ హల్ చల్ చేశారు. ఒక రకంగా ఏపిలో ఈ మూవీ చాలా ప్రభావం చూపించిందనే చెప్పొచ్చు. ఈ మూవీలో టీడీపీ అధినేత చంద్రబాబు ని విమర్శిస్తున్నట్లు ఉందని ఎన్నో కాంట్రవర్సీలు సృష్టించారు. మొత్తానికి ఏపిలో ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ మూవీ రిలీజ్ చేశారు.  తాజాగా రాంగోపాల్ వర్మ మరో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు.  ఆయన తెరకెక్కిస్తున్న మూవీ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. ఏపీ రాజకీయాలను ప్రతిబింబించేదిగా భావిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

అయితే, తన సినిమాకు ప్రమోషన్ వర్క్ అప్పుడే మొదలు పెట్టారు.  ఈ మూవీపై ఫోకస్  కల్పించేందుకు  ట్విట్టర్ వేదికగా ఒక్కో ఫోటో రివీల్ చేస్తూ హంగామా చేస్తున్నారు.  తాజాగా, ట్విట్టర్ లో ఓ ఫొటో పోస్టు చేసి ఇందులో ఉన్న ఇద్దరు క్యారక్టర్లు ఎవరో చెబితే బహుమతి ఇస్తానంటూ ప్రకటించారు. అంతేకాదు, దీపావళి రోజున 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తున్నామని వెల్లడించారు. మొత్తానికి ఈ మూవీ ఏపి రాజకీయాల్లో ఎంత వరకు సెన్సేషన్ సృష్టిందో వేచి చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: