టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. గతంలో ఆయన
కామెడీ, మాఫియా,
హర్రర్ సినిమాలు తీస్తూ మంచి క్రేజ్ సంపాదించారు. ఇటీవల కాలంలో వర్మకు ఏదీ పెద్దగా కలిసి రావడం లేదు. తెలుగులో రక్త
చరిత్ర తర్వాత ఆ స్థాయి హిట్ మళ్లీ అందుకోలేకపోయారు రాంగోపాల్ వర్మ. ఇక సినిమాల సంగతి ఎలా ఉన్న తన
ట్విట్టర్ తో ఏదో ఒక విషయంపై సంచలనం సృష్టిస్తున్నారు.
ఆ మద్య ఏపిలో ఎన్నికల సమయంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీతో తెగ హల్ చల్ చేశారు. ఒక రకంగా ఏపిలో ఈ
మూవీ చాలా ప్రభావం చూపించిందనే చెప్పొచ్చు. ఈ మూవీలో
టీడీపీ అధినేత చంద్రబాబు ని విమర్శిస్తున్నట్లు ఉందని ఎన్నో కాంట్రవర్సీలు సృష్టించారు. మొత్తానికి ఏపిలో ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ
మూవీ రిలీజ్ చేశారు. తాజాగా రాంగోపాల్ వర్మ మరో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు. ఆయన తెరకెక్కిస్తున్న
మూవీ 'కమ్మ రాజ్యంలో
కడప రెడ్లు'.
ఏపీ రాజకీయాలను ప్రతిబింబించేదిగా భావిస్తున్న ఈ
మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
అయితే, తన సినిమాకు ప్రమోషన్ వర్క్ అప్పుడే మొదలు పెట్టారు. ఈ మూవీపై ఫోకస్ కల్పించేందుకు
ట్విట్టర్ వేదికగా ఒక్కో ఫోటో రివీల్ చేస్తూ హంగామా చేస్తున్నారు. తాజాగా,
ట్విట్టర్ లో ఓ ఫొటో పోస్టు చేసి ఇందులో ఉన్న ఇద్దరు క్యారక్టర్లు ఎవరో చెబితే బహుమతి ఇస్తానంటూ ప్రకటించారు. అంతేకాదు,
దీపావళి రోజున 'కమ్మ రాజ్యంలో
కడప రెడ్లు' ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తున్నామని వెల్లడించారు. మొత్తానికి ఈ
మూవీ ఏపి రాజకీయాల్లో ఎంత వరకు సెన్సేషన్ సృష్టిందో వేచి చూడాలి.