టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ సరిలేరు నీకెవ్వరు. తన కెరీర్ లో మహేష్ బాబు తొలిసారి మిలిటరీ ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీప్రసాద్ సంగీతాన్ని, అలానే రత్నవేలు ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ద్వారా చాలా రోజల తరువాత లేడీ అమితాబ్ గా పేరుగాంచి విజయశాంతి గారు టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్నారు. 

అలానే కమెడియన్ బండ్ల గణేష్, హీరోయిన్ సంగీత కూడా ఈ సినిమా ద్వారా రీఎంట్రీ ఇవ్వడం జరుగుతోంది. ఇకపోతే మరొక రెండు రోజుల్లో రాబోతున్న దీపావళి సందర్భంగా తమ సినిమా కు సంబంధించి ఇప్పటికే ఒక సర్ప్రైజ్ ఉందని కొద్దిరోజుల క్రితం అనౌన్స్ చేసిన సినిమా  యూనిట్, కాసేపటి క్రితం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు పెద్ద సర్ప్రైజింగ్ న్యూస్ ని చెప్పారు. రేపు ఒకటి కాదు, ఏకంగా రెండు సర్ప్రైజ్ లు తమ సినిమా టీమ్ నుండి రాబోతున్నాయని, అందులో విజయశాంతి గారి ఫస్ట్ లుక్ పోస్టర్ రేపు ఉదయం 9 గంటల 9 నిమిషాలకు రిలీజ్
కానుండగా, మహేష్ బాబు లుక్ ని సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. 

దీనితో సూపర్ స్టార్ ఫ్యాన్స్ సంబరాలు చేయడం మొదలెట్టేసాడు. ఇప్పటికే సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ బెర్తును రిజర్వు చేసుకున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. కర్నూలు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మురళి శర్మ, రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాస రెడ్డి, హరితేజ తదితరులు నటిస్తుండగా, ప్రకాష్ రాజ్ విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం....!!


మరింత సమాచారం తెలుసుకోండి: