టాలీవుడ్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ సరిలేరు నీకెవ్వరు. తన కెరీర్ లో
మహేష్ బాబు తొలిసారి మిలిటరీ ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో
మహేష్ సరసన
రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీప్రసాద్ సంగీతాన్ని, అలానే రత్నవేలు ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఇకపోతే ఈ
సినిమా ద్వారా చాలా రోజల తరువాత లేడీ
అమితాబ్ గా పేరుగాంచి
విజయశాంతి గారు
టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్నారు.
అలానే
కమెడియన్ బండ్ల గణేష్, హీరోయిన్
సంగీత కూడా ఈ
సినిమా ద్వారా రీఎంట్రీ ఇవ్వడం జరుగుతోంది. ఇకపోతే మరొక రెండు రోజుల్లో రాబోతున్న
దీపావళి సందర్భంగా తమ
సినిమా కు సంబంధించి ఇప్పటికే ఒక సర్ప్రైజ్ ఉందని కొద్దిరోజుల క్రితం అనౌన్స్ చేసిన సినిమా యూనిట్, కాసేపటి క్రితం
సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు పెద్ద సర్ప్రైజింగ్ న్యూస్ ని చెప్పారు. రేపు ఒకటి కాదు, ఏకంగా రెండు సర్ప్రైజ్ లు తమ
సినిమా టీమ్ నుండి రాబోతున్నాయని, అందులో
విజయశాంతి గారి ఫస్ట్ లుక్ పోస్టర్ రేపు ఉదయం 9 గంటల 9 నిమిషాలకు రిలీజ్
కానుండగా,
మహేష్ బాబు లుక్ ని సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు.