బిగ్ బాస్ మూడవ సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే
రాహుల్ మరియు
బాబా భాస్కర్ గ్రాండ్ ఫైనల్ కు అర్హత సాధించగా
వరుణ్ సందేశ్,
శ్రీముఖి,
శివ జ్యోతి మరియు
అలీ రెజా ఈవారం నామినేషన్లలో నిలిచి ఉన్నారు. వీరిలో ఒకరు ఆదివారం
ఎపిసోడ్ లో ఎలిమినేట్ కానుండగా మిగిలిన ముగ్గురు
బాబా మరియు
రాహుల్ తో కలిసి గ్రాండ్ ఫినాలే వీక్ లో కి వెళ్తారు. వారిలో నుండి మరుసటి ఆదివారం నాటి
ఎపిసోడ్ కి మరొక ముగ్గురిని ఎలిమినేట్ చేసి చివరికి మిగిలిన ఇద్దరు సభ్యులలో ఒకరిని విజేతగా ప్రకటిస్తారు.
అయితే ఈ వారం ఎలిమినేట్ కానున్న ఇంటి సభ్యులు ఎవరు ఫైనల్లోకి అడుగుపెట్టనున్న అయిదుగురు ఎవరు అన్న దానిపై అభిమానులంతా చాలా ఆసక్తిగా ఉన్నారు. అయితే బయటకు వచ్చిన సమాచారం ప్రకారం
శివ జ్యోతి వారం ఇంటి నుండి ఎలిమినేట్ కానుందట. 'పాతాళ గంగ' గా పేరు తెచ్చుకున్న
శివ జ్యోతి అంతా అనుకున్నదాని
కన్నా ఎక్కువ రోజులే ఇంటిలో కొనసాగింది. చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మధ్య గట్టి పోటీని తట్టుకొని
ఆమె ఇన్ని రోజులు హౌస్ లో నిలబడటం ఆశ్చర్యకరమైన విషయం. తరచుగా ఎమోషనల్ అయిపోయి కన్నీరు కార్చేసే
శివజ్యోతి రానురానూ కొద్ది కొద్దిగా తాను కూడా గుర్తించదగ్గ కంటెస్టెంట్ అని చాటి చెప్పుకుంది.
అయితే... నామినేషన్ లోకి వెళ్లకుండా ఉండేందుకు సేఫ్
గేమ్ ఆడడం మరియు ఇతరుల
గేమ్ ను అంచనా వేయకపోవడం.... తనకంటూ ఒక స్ట్రాటజీని ప్రిపేర్ చేసుకోలేకపోవడం
శివజ్యోతి కి ఉన్న మైనస్ లు అని చెప్పవచ్చు. అలాగే
వరుణ్ మరియు వితికా తో జరిగిన గొడవలో
శివ జ్యోతి హైలెట్ అయినా కూడా ఆ జోరును కొనసాగించలేక చివరికి ఇంటినుండి బయటికి వెళ్లేందుకు ప్రధమ కంటెస్టెంట్ గా నిలిచింది
శివ జ్యోతి. అయితే ఒక మామూలు
టీవీ చానెల్ లో యాంకర్ గా ఉన్న
శివ జ్యోతి బిగ్ బాస్ ద్వారా మరిన్ని మంచి అవకాశాలు దక్కించుకుంటుంది అన్నది అందరి భావన.