మాటల మాంత్రికుడు
త్రివిక్రమ్ శ్రీనివాస్, తొలిసారి వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన స్వయంవరం
సినిమా ద్వారా
కథ మరియు మాటల రచయితగా పరిచయం అవడం జరిగింది. అయితే పని చేసిన తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న
త్రివిక్రమ్, ఆ తరువాత మరికొన్ని సినిమాలకు
కథ, మాటలు అందించారు. ఇక అనంతరం కొన్నాళ్ళకు
తరుణ్ హీరోగా తెరకెక్కిన నువ్వే నువ్వే సినిమాతో ఆయన దర్శకుడిగా మారడం జరిగింది. ఆ
సినిమా హిట్ కావడం, అనంతరం ఆయనతో
సూపర్ స్టార్ మహేష్ అతడు
సినిమా చేయడం జరిగింది. అయితే ద్వితీయ విఘ్నాన్ని అధిగమించి, రెండవ సినిమాతో కూడా మరొక హిట్ అందుకున్న
త్రివిక్రమ్,
అక్కడినుండి
పవన్ కళ్యాణ్,
అల్లు అర్జున్,
ఎన్టీఆర్ వంటి తదితర స్టార్లతో సినిమాలు చేసి మంచి విజయాలు అందుకున్నారు. అయితే కెరీర్ పరంగా కొన్ని అపజయాలు కూడా చవిచూసిన
త్రివిక్రమ్, ఇకపై తాను చేయబోయే సినిమాల విషయం ఎంతో జాగ్రత్తగా వ్యవహరించనున్నారట. ఇటీవల
పవన్ కళ్యాణ్ తో ఆయన తీసిన అజ్ఞాతవాసి
సినిమా, ఒక ఫ్రెంచ్ సినిమాకు కాపీగా తీశారు అని వార్తలు రావడంతో,
త్రివిక్రమ్ పై కొంత నెగటివ్ ప్రచారం జరిగింది. అయితే తన తదుపరి
ఎన్టీఆర్ తో చేసిన అరవింద సమేత సినిమాతో మంచి హిట్ అందుకుని, తన టాలెంట్ ని మరొక్కసారి నిరూపించుకున్నారు త్రివిక్రమ్. ఇక ప్రస్తుతం
అల్లు అర్జున్ హీరోగా
అల వైకుంఠపురములో అనే సినిమాను తీస్తున్న
త్రివిక్రమ్,
ఈ సినిమాలో అన్ని రకాల కమర్షియల్ అంశాలు సమపాళ్లలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అలానే ఎక్కడా కూడా కాపీ అనే మాట రాకుండా,
కథ మరియు కథనాల విషయమై ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు టాక్. ఇక ఇప్పటికే ఈ
సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్ మరియు టీజర్, విశేషమైన ప్రేక్షకాదరణ పొందడంతో, త్వరలో రిలీజ్ కాబోయే
సినిమా కూడా మంచి సక్సెస్ సాదిస్తుందని ఎంతో నమ్మకంగా ఉన్నారట. మరి
త్రివిక్రమ్ ఎంతో కసిగా, జాగ్రతగా తెరకెక్కించిన ఈ
సినిమా ఎంత మేర సక్సెస్ సాధిస్తుందో చూడాలి....!!