ప్రస్తుతం కొన్నేళ్ల తరువాత టాలీవుడ్ సినిమా పరిశ్రమకు సూపర్ స్టార్ మహేష్ హీరోగా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా నటిగా ఎంట్రీ ఇస్తున్నారు లేడీ అమితాబ్ గా పేరుగాంచిన విజయశాంతి గారు. మధ్యలో రాజకీయాల్లో తాను బిజీ బిజీగా ఉన్నప్పటీకీ, అక్కడక్కడా కొన్ని సినిమా ఆఫర్లు వచ్చాయని, అయితే అవేవి తనకు నచ్చకపోవడంతో తాను ఒప్పుకోలేదని, అయితే ఫైనల్ గా ఇటీవల అనిల్ రావిపూడి చెప్పిన క్యారెక్టర్ నచ్చడంతో సరిలేరు సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్లు ఇటీవల విజయశాంతి చెప్పడం జరిగింది. 

ఇక ఈ సినిమాలో భారతి అనే క్యారెక్టర్ లో విజయశాంతి గారు నటిస్తున్న పవర్ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని నిన్న ఉదయం రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఆ పోస్టర్ కు మంచి స్పందన లభించడం జరిగింది. ఇకపోతే మరొక సీనియర్ నటి టబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో. కొన్నాళ్లుగా తెలుగు సినిమాల్లో నటించడం చాలావరకు తగ్గించిన టబు, ఈ సినిమాలో త్రివిక్రమ్ గారు వివరించిన తన క్యారెక్టర్ కు ఎంతో స్కోప్ ఉందని, అందుకే తాను ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్లు చెప్పారు టబు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో టబు పాత్ర ఎటువంటిది, సినిమాలో ఆమెకు ఎంతవరకు స్కోప్ ఉంటుందని అనే విషయాలపై మాత్రం ఇప్పటి వరకు ఇంకా న్యూస్ బయటకు రాలేదు. 

ఇక ఈ విధంగా కొంత యాదృచ్చికంగా అటు విజయశాంతి గారు మహేష్ సినిమా ద్వారా, అలానే టబు గారు బన్నీ సినిమా ద్వారా టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తుండడంతో అందరి కళ్ళు ఈ ఇద్దరు సీనియర్ నటీమణుల మీద పడ్డాయి. అందులోను ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతుండడంతో, ఏ సినిమా ఎంత మేర విజయం సాధిస్తుందో, అలానే ఈ రెండు సినిమాల్లోని ఈ ఇద్దరు నటీమణుల్లో ఎవరు ఎంత గొప్ప పేరు సంపాదిస్తారు అనే అంశం కూడా చర్చకు వస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ ఇద్దరి పెర్ఫార్మన్స్ ఎంతమేర ప్రేక్షకులను అలరిస్తుందో, ఎవరు ప్రేక్షకుల మనసు గెలుస్తారో చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: