టాలీవుడ్ సినిమా పరిశ్రమకు వెంకీ కుడుములు దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా తెరకెక్కించిన ఛలో సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టి, తొలిసినిమా తోనే మంచి హిట్ అందుకున్న భామ రష్మిక మందన్న. ఆ తరువాత టాలీవుడ్ యూత్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం సినిమాలో నటించి మరొక సూపర్ డూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇక అక్కడినుండి రష్మికకు మన టాలీవుడ్ లో మరింతగా అవకాశాలు పెరిగాయి. 

ఇక ప్రస్తుతం నితిన్ సరసన భీష్మ, సూపర్ స్టార్ మహేష్ గారి సరసన సరిలేరు నీకెవ్వరు తో పాటు సుల్తాన్ అనే తమిళ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో కలిసి ఆమె నటిస్తున్న సరిలేరు నీకెవ్వరులో ఆమె పాత్ర ఎంతో సరదాగా సాగుతుందని, అలానే ఆమె క్యారెక్టర్ తెరపై కనపడినప్పుడల్లా ఆడియన్స్ పడి పడి నవ్వడం ఖాయం అని ఇటీవల దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పడం జరిగింది. ఇకపోతే దీపావళి సందర్భంగా లేటెస్ట్ గా మహేష్ బాబు, విజయశాంతి ల పోస్టర్స్ రిలీజ్ చేసిన సినిమా యూనిట్, కాసేపటి క్రితం నేడు పండుగను పురస్కరించి ప్రత్యేకంగా రష్మిక పిక్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. 

ఇక ఆ ఫొటోలో మహేష్ బాబు నవ్వుతూ ఉండగా, రష్మిక తన ఫ్యామిలీ మెంబెర్స్ తో కలిసి పెళ్ళికూతురిలా ముస్తాబు చేసుకుని ఉండడం గమనించవచ్చు. అయితే ఆ పిక్ ని రష్మిక తన ట్విట్టర్ ద్వారా ట్యాగ్ చేస్తూ, నేను మరియు మా కుటుంబసభ్యులు కలసి నన్ను చూడడానికి వచ్చిన 101వ పెళ్ళికొడుకుని ఎలా హ్యాండిల్ చేసామో తెలియాలంటే రాబోయే 2020 జనవరి 12వరకు వేచి చూడండి అంటూ సరదాగా పోస్ట్ చేసింది. ఇక ప్రస్తుతం ఆ పోస్టర్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. సీనియర్ నటి విజయశాంతి గారు భారతి అనే ప్రొఫెసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: