టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇడియట్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు రవితేజ.  అంతకు ముందు చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన రవితేజ ‘ఇడియట్’ సినిమాతో హీరోగా మారిన తర్వాత మాస్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది.  కమీషనర్లు ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు..చంటిగాడు లోకల్.. అనే డైలాగ్ తో యూత్ ని బాగా ఆకట్టుకున్నాడు.  ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు సూపర్ హిట్ అయ్యింది. 


ఇక పవర్ సినిమా తర్వాత రవితేజ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి.  దాంతో రెండేళ్లు గ్యాప్ తీసుకున్న రవితేజ, అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.  ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ వరుస ఫ్లాపులతో మరోసారి కష్టాల్లో పడ్డాడు రవితేజ. అయితే  ర‌వితేజ‌కు పోలీస్ క‌థ‌లు బాగానే  కలిసొచ్చాయి. గతంలో పోలీస్ గా క‌నిపించిన‌ విక్ర‌మార్కుడు ర‌వితేజ కెరీర్‌లో పెద్ద హిట్టు.  'ప‌వ‌ర్‌' కూడా ర‌వితేజ ప‌వ‌ర్‌ని చూపించింది. దాంతో అదే ఉత్సహంతో ఇప్పుడు మ‌రోసారి ఖాకీ యూనిఫామ్ వేయ‌బోతున్నాడు. 


ప్రస్తుతం వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో  రవితేజ  'డిస్కోరాజా' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని క్రిస్‌మస్‌ కానుకగా డిసెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.   కాలాన్ని వెనక్కి పంపడం అనే ఓ విభిన్న కధాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఆ తర్వాత మరోసారి బలుపు కాంబినేషన్ వెండి తెరపై రానున్నదని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. గోపీచంద్ మ‌లినేని సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు ర‌వితేజ‌.  ఈ రోజు సినిమా ఎనౌన్స్ చేసారు. ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ  మూవీలో రవితేజ మరోసారి పోలీస్ గా కనిపించి అలరించనున్నారు. ఈ మూవీకి `క్రాక్‌` అనే  టైటిల్  పెట్టిన‌ట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: