టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల సుజీత్ దర్శకత్వంలో సాహో సినిమా చేసిన విషయం తెలిసిందే. అంతకముందు బాహుబలి రెండు భాగాలతో అత్యద్భుత విజయాలు అందుకున్న ప్రభాస్, సాహోతో కేవలం పర్వాలేదనిపించే విజయాన్ని మాత్రమే దక్కించుకోగలిగారు. ఇక ప్రస్తుతం పూజ హెగ్డే తో కలిసి జాన్ అనే సినిమాలో నటిస్తున్న ప్రభాస్, ఎలాగైనా ఆ సినిమాతో మంచి హిట్ కొట్టి, తన ఫ్యాన్స్ ని ఖుషి చేయాలని చూస్తున్నారు. అందుకే జాన్ విషయంలో ఆయన ఎంతో కేర్ తీసుకుంటున్నారని, అలానే సాహో విషయంలో చేసిన కొన్ని పొరపాట్లని ఈ సినిమా విషయంలో మాత్రం ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే నలభై శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఇటీవల సాహోలో బాగా బాడీ పెంచిన ప్రభాస్, జాన్ కోసం కొంచెం ఒళ్ళు చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే నేటి ఉదయం మంచు వారి అబ్బాయి విష్ణు మరియు ఆయన భార్య విరోనికా లతో కలిసి ప్రభాస్ నిన్న సరదాగా గడిపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా విష్ణు దంపతులతో కలిసి ప్రభాస్ దిగిన ఫోటోలను విష్ణు తన ఇన్స్టాగ్రమ్ లో పోస్ట్ చేయడం జరిగింది. చాలా రోజుల తరువాత మన డార్లింగ్ ని కలిసి ఎంతో ఎంజాయ్ చేసాము."నా సోదరుడుతో ఇలా సూపర్ ఫన్నీగా గడిపి చాలా కాలం అయింది" 

అంటూ విష్ణు తన పోస్ట్ కు ఒక క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫొటోల్లో ప్రభాస్ కొంత చబ్బీగా బాగా బుగ్గలు మరియు గడ్డంతో కొంత రఫ్ లుక్ లో కనపడుతుండడంతో, ఆ లుక్ జాన్ సినిమా కోసమే అని వార్త ప్రచారం అవుతోంది. ప్రస్తుతం ప్రభాస్ జాన్ సినిమాలో నటిస్తుంటే, విష్ణు మాత్రం తన తదుపరి సినిమా విషయమై కొన్ని కథలు వింటున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం విష్ణు దంపతులతో కలసి ప్రభాస్ దిగిన ఫోటోలు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతగా వైరల్ అవుతున్నాయి. ఇక డార్లింగ్ ఫ్యాన్స్ వాటిని తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా విపరీతంగా లైక్స్ మరియు షేర్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: