టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన సమంత... తన నటనతో ఎప్పుడు అదరగొడుతుంటుంది . అయితే ఏ
మాయ చేసావే సినిమాతో
టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత... తన మొదటి సినిమాలో జంటగా నటించిన నాగచైతన్య ను
పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మామూలుగా అయితే హీరోయిన్ లు అందరికీ
పెళ్లి తర్వాత ఆఫర్లు తగ్గిపోతుంటాయి. కానీ సమంత మాత్రం
పెళ్లి తర్వాత అక్కినేని కోడలిగా తన క్రేజ్ ఎక్కడికో వెళ్ళి పోయింది. ఇక విభిన్నమైన
సినిమా కథలు ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది సమంత.
నాగచైతన్యతో
ప్రేమ వివాహం తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతుంది. అంతేకాకుండా తనలోని నటిని ప్రతి సినిమాలో కొత్తగా ప్రజెంట్ చేసుకుంటూ... ప్రశంసలు అందుకుంటోంది సమంత.
పెళ్లి తర్వాత ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్నాయి . ఈ ఏడాది మొదట్లో మజిలీ
సినిమా తో రియల్ లైఫ్ స్జోడి రిల్ లైఫ్ లో నటించిగా... ఈ
సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన ఓ బేబీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు 96
సినిమా రీమేక్ లో
శర్వానంద్ కు జోడీగా నటిస్తోంది సమంత. ఇదిలా ఉండగా సమంత ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
తన ఫ్యామిలీకి సంబంధించిన పలు ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది ఈ అమ్మడు . అయితే తాజాగా
దీపావళి సందర్భంగా... సోషల్ మీడియాలో ఏమోషనల్ పోస్టు పెట్టింది ఈ అమ్మడు. దేవుడు దయతో మంచి ఆరోగ్యం మంచి ఫ్యామిలీ మంచి
ఫ్రెండ్స్ ను ఇచ్చి ఆశీర్వదించారు అని... ఇంత అద్భుతమైన జీవితాన్ని తనకు ఇచ్చినందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటూ తన ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్టు పెట్టింది సమంత. అంతేకాకుండా
దీపావళి పండుగ వేళ కుటుంబ సమేతంగా ఉన్న ఓ ఫోటోని షేర్ చేసింది.