సెన్సేషనల్ బ్లాక్బస్టర్ చిత్రం 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత రామ్ హీరోగా చేస్తున్న చిత్రం ఖరారైంది.
తిరుమల కిషోర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది.
శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై 'స్రవంతి' రవికిషోర్ నిర్మించనున్న ఈ చిత్రానికి 'రెడ్' అనే టైటిల్ ప్రకటించారు. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఈ చిత్రం టైటిల్ని, ఇందులో
హీరో రామ్ ఫస్ట్ లుక్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా 'స్రవంతి' రవికిషోర్ మాట్లాడుతూ ''ఇప్పటి వరకూ రామ్ చేసిన సినిమాలకు పూర్తి విభిన్నంగా ఉంటుంది. రామ్ -
తిరుమల కిషోర్ కాంబినేషన్లో ఇది మూడో చిత్రం. 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ' విజయాల తర్వాత వాళ్లిద్దరి కాంబినేషన్లో మళ్లీ
సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. మా సంస్థలో ప్రముఖ
సంగీత దర్శకుడు
మణిశర్మ పనిచేయడం ఇదే తొలిసారి. నవంబర్ 16 నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. ఇతర తారాగణం వివరాలు త్వరలోనే తెలియజేస్తాం'' అని తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ:
కృష్ణ పోతినేని, సంగీతం:
మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఫైట్స్ : పీటర్ హెయిన్స్ ,ఎడిటింగ్: జునైద్.
ఇకపోతే తిరుమల రవికిషోర్ గత చిత్రాలన్నీ స్లో లవ్ అండ్ రొమాంటిక్ మూవీస్ చాలా నీట్గా ఉంటాయి. మనసులోని భావాలన్నీ కేవలం కళ్ళతోనే పలికించేలా ఉంటాయి ఆయన గత చిత్రాలు తీసుకుంటే ఇక మరి ఈ చిత్రం విషయానికి వస్తే పక్కా
మాస్ గా
రామ్ కనిపిస్తున్నారు. మరి స్లో అండ్ లవ్ మూవీస్ చేసే తిరుమల యాక్షన్
మాస్ మూవీస్ చెయ్యగలడా ఒక వేళ చేస్తే అది ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు ఎదురు చేస్తున్నారు. ఇద్దరి మనుషుల మధ్య ఎమోషన్స్ని పండించడంలో తనదైన శైలిలో చిత్రీకరిస్తారు తిరుమల. ఇకపోతే ఈ చిత్రం తమిళ్
మూవీ తడమ్
రీమేక్ గా కొందరు అనుకుంటున్నారు.