2013లో విడుదలైన
హిందీ మూవీ "మద్రాస్ కెఫె"లో భారత ఇంటలిజెంస్ అధికారి విక్రం సింగ్
భార్య రూబి సింగ్ పాత్ర ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది రాశీఖన్నారు. తర్వాత నాగశౌర్య హీరోగా నటించిన ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో
టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా...ఆ తర్వాత గోపిచంద్తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు
ఆడియన్స్ మనసు దోచుకుంది. అప్పట్లో ఈ అమ్మడు కాస్త బొద్దుగా కనిపించింది. అయితే హీరోయిన్ గ్లామర్ తో పాటు నాజుగ్గా ఉండాలనే ఉద్దేశంతో డైటింగ్ చేసి సన్నబడింది.
వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన తొలిప్రేమలో నటించి సూపర్ హిట్ అందుకుంది.
తాజాగా సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘ప్రతిరోజూ పండుగే’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. 'చిత్ర లహరి' సినిమాతో హిట్ అందుకున్న
సాయి ధరమ్ తేజ్,
మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజూ పండుగే’ సినిమాలో నటిస్తున్నారు. అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాస్ ఈ
మూవీ నిర్మిస్తున్నారు. ఎస్కేఎన్ సహ నిర్మాత. తేజూ సరసన రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ఎస్ఎస్
తమన్ ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నాడు.
ఇక తెలుగు
ఆడియన్స్ తనదైన గ్లామర్ షో తో మతులు పోగొడుతున్నరాశీఖన్నా ‘జైలవకుశ’ మూవీలో
ఎన్టీఆర్ వంటి స్టార్
హీరో సరసన కథానాయకగా నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ. గతంలో ఓ సంఘటన గురించి చెప్పింది. సాధారణంగా
ఎన్టీఆర్ తో నటించే హీరోయిన్లకు డ్యాన్స్ విషయంలో కండీషన్లు పెడుతుంటారు..ఎందుకంటే
ఎన్టీఆర్ అంత ఫాస్ట్ గా వారు ఉండలేరని..ఈ విషయాన్ని చాలా మంది హీరోయిన్లు బహిరంగంగానే చెప్పారు. అయితే ‘జై లవకుశ’
సినిమా షూటింగ్ సమయాలో
ఎన్టీఆర్ కి హీరోయిన్ రాశిఖన్నా షాక్ ఇచ్చిందట.
ఎన్టీఆర్ వేసే స్టెప్పులు తనకు చెప్పాలని డిమాండ్ చేసిందట.
ఈ విషయాన్ని రాశిఖన్నా స్వయంగా వెల్లడించింది. జై లవకుశ లో ఓ సాంగ్ కంపోజ్ చేస్తున్నపుడు తనకు కూడా సిగ్నేచర్ స్టెప్పులు కావాలంటూ పట్టుపట్టిందట. అయితే
ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన కొన్ని డాన్స్ మూవ్ మెంట్స్ తాను కూడా చేస్తానని మొండి పట్టు పట్టిందట..దాంతో
ఎన్టీఆర్ సై అనడం రాశీ ఖన్నా డ్యాన్స్ వేయడం జరిగిందట. సాయిధరమ్ తేజ్ తో ఆ మద్య ‘సుప్రీమ్’ సినిమాలో నటించింది రాశీఖన్నా. ఈ
సినిమా సూపర్ హిట్ అయ్యింది. తాజాగా ప్రతిరోజూ పండగే సినిమాతో మరోసారి ఈ జంట హిట్ కొడతారో లేదో చూడాలి.