కోలీవుడ్ నటుడు కార్తీ హీరోగా యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా
సినిమా ఖైదీ. కార్తీ తొలిసారి ఒక లారీ
డ్రైవర్ పాత్రలో నటించిన ఈ
సినిమా, మంచి ఆకట్టుకునే
కథ, కథనాలతో తెరకెక్కి, ప్రేక్షకుల మదిని దోచి, అటు తమిళనాడు తోపాటు ఇటు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. పూర్తిగా నైట్ ఎఫెక్ట్ లో సాగిన ఈ
సినిమా కథ, కేవలం ఒక రాత్రిలోనే సాగుతుంది. ఇక సినిమాలోని కీలక పాత్రలను అవసరం మేరకు వాడుకున్న దర్శకుడు,
హీరోగా నటించిన
కార్తి పాత్రను మరింతగా గొప్పగా తీర్చిదిద్దారు. ఇక కార్తీ కూడా తన పాత్రలో ఎంతో ఒదిగిపోయి నటించి, ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులతో సైతం మంచి మార్కులు సంపాదించారు. ఇకపోతే ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ
సినిమా, నైజాంలో షాకింగ్ రేంజ్ లో తన హవాను కొనసాగిస్తోంది. నిన్న రూ. 30,57,663 ల షేర్ ని దక్కించుకున్న ఈ
సినిమా, నైజాంలో మొత్తం ఇప్పటివరకూ రూ.94,17,531 ల షేర్ ని దక్కించుకుని లాభాల్లోకి ప్రవేశించబోతోందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక ఈ సినిమాను కొన్న బయ్యర్లు ఎంతో ఆనందంతో సంబరపడిపోతున్నారు.
అలానే మన రాష్ట్రంలోని కొన్ని
మాస్ ఏరియాల్లో కూడా
ఖైదీ కలెక్షన్ల దుమ్ము దులుపుతున్నాడని, ఇక రాబోయే మరికొద్ది రోజుల వరకు మరే పెద్ద
సినిమా కూడా రిలీజ్ లేకపోవడంతో, ఈ
ఖైదీ సినిమా మరింత అద్భుతంగా కలెక్షన్ కొల్లగొట్టే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మొత్తానికి కొన్నాళ్ల నుండి సరైన సక్సెస్ లేని కార్తీ, ఈ
సినిమా ద్వారా అత్యద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుని దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పలువురు దర్శకుల నుండి కథలు వింటున్న కార్తీ, రాబోయే రోజుల్లో
ఖైదీ సీక్వెల్ లో కూడా నటించనున్నాడు....!!