క్రేజీ హీరో విజయ్ దేవరకొండ బీటౌన్ లో అరుదైన రికార్డ్ సొంతం చేసుకోబోతున్నాడు. ఈ క్రేజీ హీరో సినిమాలకు నార్త్ లో క్రేజీ డిమాండ్ ఏర్పడింది. విజయ్ సినిమాలు బాలీవుడ్ లో వరుసపెట్టి రీమేక్ కాబోతున్నాయి. అర్జున్ రెడ్డి రిమేక్ కబీర్ సింగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇపుడు అదే బాటలో విజయ్ మూవీస్ రిమేక్ కాబోతున్నాయి. 


విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ సెన్సేషన్ హీరో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. డియర్ కామ్రేడ్ అనుకున్నంత విజయం సాధించలేకపోయిన ఈ యంగ్ హీరోకు కెరీర్ కు వచ్చిన ముప్పేమీ లేదు. ఐదు సినిమాల అనుభవం లేని విజయ్ దేవరకొండ క్రేజీ బాలీవుడ్ వరకు పాకిపోయింది. అంతేకాదు ఇపుడు బాలీవుడ్ లో ఈ యంగ్ హీరో సినిమాలను వరుసపెట్టి రిమేక్ చేస్తుండటం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఇప్పటికే అర్జున్ రెడ్డి రిమేక్ బాలీవుడ్ లో రికార్డ్స్ మోత మోగించింది. 


కబీర్ సింగ్ ఇన్ స్పిరేషన్ తో విజయ్ నటించిన సినిమాలను బీటౌన్ లో రీమేక్ చేేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. కబీర్ సింగ్ టైంలో డియర్ కామ్రేడ్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నట్టుగా కరణ్ జోహార్ ప్రకటించాడు. డియర్ కామ్రేడ్ చిత్రం తెలుగులో ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ ను అందుకోలేదు. అయినా కూడా హిందీలో ఈ చిత్రం రీమేక్  ఏర్పాట్లు జరుగుతున్నాయి. యర్ కామ్రేడ్ తో పాటు ట్యాక్సీవాలా సినిమాను కూడా బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు. ఇషాన్ ఖట్టర్ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా టాక్సీవాలా రీమేక్ పట్టాలెక్కబోతోంది. ఈ రీమేక్ కు ఖాలి పీలి టైటిల్ ను ఖరారు చేశారు. రిలీజ్ టైంలో పెద్దగా ఆశలు లేని ట్యాక్సీవాలా తెలుగులోమంచి విజయం సాధించింది. ఇపుడు సినిమాను బాలీవుడ్లో ఫిల్మ్ మేకర్ అబ్బాస్ జాఫర్ ఈ రీమేక్ చేయబోతున్నారు. ఖాలి పీలి సినిమాను ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేశారు. ఈ రీమేక్ లతో పాటు గీత గోవిందం చిత్రంను కూడా రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. 





మరింత సమాచారం తెలుసుకోండి: