ఇప్పటికే స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయిన
బిగ్ బాస్ రెండు సీజన్స్ ఎంతో మంచి క్రేజ్ తో అలానే అదిరిపోయే రేటింగ్స్ తో దూసుకుపపోడం జరిగింది. తొలిసారి జరిగిన మొదటి సీజన్ కు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు రెండవ సీజన్ కు నాచురల్ స్టార్
నాని హోస్టులుగా వ్యవహరించి తమ టాలెంట్ తో షో ను మంచి సక్సెస్ చేసారు. ఇకపోతే ఇటీవల
కింగ్ నాగార్జున గారి సారథ్యంలో ప్రారంభమైన
బిగ్ బాస్ సీజన్ 3, ప్రస్తుతం ఆల్మోస్ట్ తుది దశకు చేరుకుంది.
ఇక గతవారం
శివజ్యోతి ఎలిమినేట్ కావడంతో
ప్రస్తుతం హౌస్ లో
ఆలీ,
శ్రీముఖి,
బాబా మాస్టర్,
రాహుల్,
వరుణ్ సందేశ్ మాత్రమే మిగిలారు. అయితే వీరిలో ఫైనల్
విన్నర్ గా ఎవరు నిలుస్తారు అనే దానిపై కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ ప్రపంచంలోని తెలుగు వారందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఫైనల్
విన్నర్ కు కేవలం మరొక మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో,
విన్నర్ పై పలు వర్గాలలో ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. ఇక నేడు కొంత ప్రచారం అవుతున్న వార్తలను బట్టి చూస్తుంటే, ప్రస్తుతం జరుగుతున్న ఓటింగ్ ని బట్టి ఒకింత మెజారిటీ ఓట్లు శ్రీముఖికే పడుతున్నట్లు సమాచారం. ఇక ఆమెతో పాటు చాలా వరకు సమానంగా
రాహుల్ కు కూడా ఓట్లు పోల్ అవుతున్నాయని, అయితే అందరికంటే ఒకింత వెనుకపడి ఉంది మాత్రం
బాబా భాస్కర్ అని కూడా చెప్తున్నారు.
అయితే ఈ వార్తలను గట్టిగా కొట్టిపారేస్తున్న వారు కూడా లేకపోలదనే చెప్పాలి.
శ్రీముఖి కంటే
రాహుల్ మరియు ఇతర సభ్యులు బాగా ఆడుతున్నారని కొందరు అంటుంటే, అందరికంటే
విన్నర్ గా నిలిచే అవకాశం
బాబా భాస్కర్ కు మాత్రమే ఉందని మరికొందరు అంటున్నారు. ఇక
వరుణ్ సందేశ్ మరియు
ఆలీ పై కూడా ఈ విధమైన మద్దతు వార్తలు వినపడుతున్నాయి. కాగా ఇప్పుడు ప్రచారం అవుతున్నవన్నీ కూడా ఒట్టి పుకార్లేనని, అయితే ఫైనల్
విన్నర్ ఎవరో తేలేది మాత్రం మరొక మూడు రోజుల తరువాతనే అని, కాబట్టి అప్పటి వరకు ఓపిక పట్టాల్సిందే అని అంటున్నారు విశ్లేషకులు....!!