కార్తీక మాసంలో ఎన్నో పండుగలు వస్తుంటాయి. ముఖ్యంగా ఈ మాసంలో ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ బాయి ధూజ్.  హిందువులు ఈ వేడుకను ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటారు.  బాయీ దూజ్ ఫెస్టివ‌ల్‌ ఎక్కువగా నార్త్ సైడ్ బాగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజు సోద‌రీమ‌ణులు త‌మ సోద‌రులకి హార‌తి ఇచ్చి నిండు నూరేళ్ళు సుఖంగా ఉండాల‌ని కోరుకుంటారు. అంతే కాదు తమ కుటుంబం, తన తల్లిగారి కుటుంబం  సుఖ సంతోషాలతో తులతూగాలని ఆడపడుచులు భగవంతున్ని వేడుకుంటారు. ఈ పండుగ రోజు తమ స్థాయికి తగ్గట్టుగా  సోద‌రునికి గిఫ్ట్‌లు కూడా ఇస్తారు. 


అయితే ఈ కల్చర్ ఇప్పుడు భాగ్యనగరంలో కూడా బాగా పెరిగిపోయింది.  అన్ని వర్గాల వారు ఇక్కడ ఉండటంతో ఎన్నో రకాల పండుగలు నగరంలో ఉత్సాహంగా వైభవంగా జరుపుకుంటారు.  కార్తీక మాసం సందర్భంగా  బాయీ దూజ్ ఫెస్టివ‌ల్‌ని సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబ సభ్యులు జరుపుకున్నారు.  గ‌త ఏడాది బాయీ దూజ్ పండుగ సంద‌ర్భంగా మ‌హేష్ కూతురు సితార త‌న అన్న‌కి హార‌తి ఇచ్చి మంచి గిఫ్ట్ ఇచ్చింది.


ఈ ఏడాది కూడా న‌మ్ర‌త స‌మ‌క్షంలో బాయీ దూజ్ పండుగ వేడుక మ‌హేష్ ఇంట్లో ఘ‌నంగా జ‌రిగింది. సితార తన అన్నయ్య గౌతమ్ కి బొట్టు పెట్టి ట్టి హార‌తి ఇచ్చి మ‌రీ సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకుంది. వేడుక‌కి సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక మందన నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు ’ సినిమా తెరెక్కిస్తున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: