తెలుగు టెలివిజన్ లో వస్తున్న బిగ్ బాస్ 3 చివరి దశకు చేరుకుంది.  మొన్నటి వరకు గేమ్స్, టాస్క్ అంటూ నానా హడావుడి చేసిన బిగ్ బాస్ గత మూడు రోజుల నుంచి యాంకర్ సుమ ను ఇంట్లోకి పంపి నవ్వుల పువ్వులు పూయించారు.  ఇదే క్రమంలో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో వంద రోజులు పూర్తయ్యాయి. దీంతో ఈసారి ఇంటి సభ్యులకు బిగ్ బాస్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇప్పటివరకు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లలో వాడిన  వస్తువులతో ఓ గదిని మ్యూజియంగా ఏర్పాటు చేశారు. 

అయితే ఈ రూమ్ లోకి ఒక్కో కంటిస్టెంట్స్ ని పిలిచి వారు ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి మొన్నటి వరకు సాగిన జర్నీ చూపించారు. మొన్న వరుణ్ సందేశ్వీడియో చూసి తన భార్య తో గడిపిన మధుర క్షణాలు గుర్తుకు వచ్చి కన్నీరు మున్నీరు అయ్యారు.  నిజంగా ఈ జర్నీ చూస్తున్న ప్రేక్షకులు కూడా ఎమోషన్ అయ్యారు. ప్రేక్షకులు తనను మిస్టర్ పెర్ఫెక్ట్, ప్రాబ్లం సాల్వర్ అని పిలుచుకుంటున్నారని వరుణ్ పై పొగడ్తలు కురిపించారు.  ప్రస్తుతం రాహుల్, శ్రీముఖిల మధ్య మాత్రం గట్టి పోటీ జరుగుతోంది.   

తర్వాత బాబా భాస్కర్ ని పిలిచారు బిగ్ బాస్. బాబా వీడియోను మొదలుపెట్టే ముందే అతడి క్యారెక్టర్ గురించి బిగ్ బాస్ వివరించారు. తర్వాత అతనికి సంబంధించిన వీడియో ప్లేశారు.  అది చూస్తున్నంత సేపు బాబా భాస్కర్ ఒక్కసారిగా ఎమోషన్ కి గురయ్యారు..వీడియో పూర్తయ్యే వరకు కన్నీరు పెట్టుకున్నారు. మొత్తానికి బిగ్ బాస్ లో ఇంటి సభ్యుల జర్నీ చూపించడం..వారు ఎమోషన్ కావడం చూస్తుంటే నిజంగానే ప్రేక్షకులకు కూడా బాధకలిగిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: