దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏదో ఒక వివాదంలో తలదూర్చి వార్తల్లోకెక్కడం  మనం తరచుగా చూస్తుంటాం. మొన్నామధ్య కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ నానా హంగామా చేసాడు. అంతకు ముందు లక్ష్మీ పార్వతి పై తీసిన సినిమాలోని ఓ పాట పలువివాదాలకు దారితీసింది. ఏది ఏమైనా వివాదాల విషయంలో వెనకడుగు వేయని మనస్తత్వంతో ముందుకెళ్లుతున్న వర్మ ఇప్పుడు తాజాగా ప్రముఖ గీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుపై మాటలతో దాడిచేసాడు.


ఎందుకంటే ఇటీవలే జొన్నవిత్తుల మీడియాతో మాట్లాడుతూ, వర్మ దిక్కుమాలిన ఆలోచనలతో వివాదాస్పద సినిమాలు తీస్తున్నాడంటూ మండిపడ్డారు. అంతే కాకుండా వర్మ ఎంతో ప్రమాదకారి అని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన టీవీ చర్చా కార్యక్రమంలో వర్మ తనకు జొన్నవిత్తుల చౌదరి అనే బిరుదు ఇచ్చాడని, అందుకే వర్మపై పప్పు వర్మ అనే బయోపిక్ తీస్తానని వెల్లడించారు. ఇక జొన్నవిత్తుల మాటలు విన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తిన్నగా ఊరుకుంటాడా,


అతని వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "ఓ నా బుజ్జి జొన్న" అంటూ మొదలుపెట్టి 'స్త్రీ సాంగత్యం' వరకు వెళ్లారు. "నీ వీడియో చూశాన్రా కిస్సీ బాయ్! నీకు అప్పుడప్పుడు, కనీసం దశాబ్దానికోసారైనా స్త్రీ సాంగత్యం అవసరం, లేకపోతే అసహనంతో చచ్చిపోతావ్ జొన్నా" అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. "అయినా నిన్ను నీ భార్యాపిల్లలు ఎలా భరిస్తున్నారో, mవాళ్ల మీద జాలి కలుగుతోంది అంటూ వెటకారం ప్రదర్శించారట.


చివర్లో "ఐ లవ్యూ డా" అంటూ ట్వీట్ ముగించారు. వర్మ మాటలు విన్న సినీజనాలు కొందరు అతను చేసిన ట్విట్‌కు లోలోన నవ్వుకుంటూ ఆకలి మీదున్న సింహం నోట్లో తలపెడితే తినకుండా ఉంటుందా.  దాని దగ్గరకు వెళ్లేముందే ఆలోచించాలి వెళ్లాక బాధపడి లాభం ఉండదని జొన్నవిత్తులమీద సెటైర్స్ వేస్తున్నారు .  


మరింత సమాచారం తెలుసుకోండి: