బాలీవుడ్ హీరోయిన్ కియరా అద్వాని తెలుగులో కూడా తన ఫాం కొనసాగిస్తుంది.
సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను సినిమాతో
టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత వినయ విధేయ రామ సినిమాలో కూడా నటించి మెప్పించింది.
బాలీవుడ్ లో సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ లతో కూడా చెలరేగిపోతున్న ఈ అమ్మడు అక్కడ కూడా క్రేజీ ఛాన్సులు అందుకుంటుంది.
రీసెంట్ గా
కబీర్ సింగ్ హిట్ తో కియరా
బాలీవుడ్ లో హాట్
హీరోయిన్ గా మారింది. ఇక ప్రస్తుతం కియరా అద్వాని తెలుగులో మరో లక్కీ ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. మెగా
ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా
కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో వస్తున్న బాక్సర్ మూవీలో కియరా అద్వాని
హీరోయిన్ గా సెలెక్ట్ చేశారని తెలుస్తుంది.
అయితే చిత్రయూనిట్ ఆమెను సంప్రదించగా డేట్స్ చూసుకుని చెబుతా అని చెప్పిందట. ఒకవేళ డేట్స్ అడ్జెస్ట్ అయ్యేలా ఉంటే మాత్రం కియరా మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించడం ఖాయం. రీసెంట్ గా గద్దలకొండ గణేష్ సినిమాతో హిట్ అందుకున్న
వరుణ్ తేజ్ బాక్సర్ గా కూడా బాక్సాఫీస్ ను షేక్ చేయాలని చూస్తున్నాడు.
ఈ
సినిమా కోసం
వరుణ్ స్పెషల్ గా బాక్సింగ్ కోచింగ్ కూడా తీసుకున్నాడని తెలిసిందే. మెగా హీరోల్లో ఇప్పటి వరకు
పవన్ కళ్యాణ్ బాక్సింగ్ నేపథ్య కథతో వచ్చాడు.
పవన్ తర్వాత మళ్లీ
వరుణ్ తేజ్ ఆ సాహసం చేస్తున్నాడు. ఈ సినిమాలో
వరుణ్ తేజ్ లుక్ కూడా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. మరి
వరుణ్ తేజ్ బాక్సర్ సినిమాతో కూడా తన హిట్ మేనియా కొనసాగిస్తాడేమో చూడాలి. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.