ఈ మద్య వరుసగా సని పరిశ్రమలో వెంట వెంటనే  విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.  నిన్న టాలీవుడ్ ప్రముఖ నటి గీతాంజలి అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే.  ఆమె మరణం జీర్ణించుకోక ముందు బాలీవుడ్ ప్రముఖ నిర్మాత  చంపక్ జైన్ కన్నుమూశారు. వీనస్ రికార్డ్ అండ్ టేప్స్ యజమానిగా కొన్నేళ్లపాటు బాలీవుడ్ సినిమాల ప్రొడక్షన్ పనుల్లో కీలకపాత్ర పోషించిన ఆయన మరణించడం సినీ ప్రముఖులను షాక్ కి గురి చేసింది. మెదడులో నరాలు చిట్లడంతో ఆయన కన్నుమూసినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. 


చంపక్ జైన్ మృతి పట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు వారి సంతాపాన్ని తెలియజేశారు. అక్షయ్ కుమార్ కెరీర్ లో బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచిన 'మై ఖిలాడీ తూ అనారి' సినిమాతో పాటు సైఫ్ అలీఖాన్, షారూక్ ఖాన్, ఐశ్వర్యారాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'జోష్' వంటి బిగ్గెస్ట్ హిట్ సినిమాలను చంపక్ నిర్మించారు. ఆయనతో తమ జ్ఞాపకాలను నెమరువేసుకున్నాయి. చంపక్ జైన్ ఆకస్మిక మరణం చాలా బాధాకరమని, ఆయన ఎంతో మంచి వ్యక్తి అని, ఆయనతో కలిసి పనిచేసిన స్మృతులు తాను ఎప్పటికీ మరిచిపోలేనని సోనూసూద్ఓ  ట్వీట్‌తో తన సంతాపం తెలిపారు.వీనస్ ఫ్యామిలీకి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

చంపక్ జైన్ మరణించినట్లు తెలుసుకున్న పలువురు సీనియర్ దర్శకులు నిర్మాతలు ఆయన ఇంటికి బయలుదేరారు.ఇక సోషల్ మీడియా వేదికగా బాలీవుడ్ సెలబ్రెస్టిస్ సంతాపం తెలియజేశారు. ఆయనతో గడిపిన క్షణాలు  మర్చిపోలేదని నిరుపమ్, మికా సింగ్, గుర్‌ప్రీత్ కౌర్ మీడియాకు తెలియజేశారు. ముంబైలోని శాంతాక్రుజ్‌లో ఇవాళ ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. వీనస్ మ్యూజిక్ కంపెనీ యజమానిగానే కాకుండా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు  అందించారని గుర్తుచేసుకున్నారు. చంపక్ జీ మంచి మానవతావాదని, పరిశ్రమ ఒక  మంచి వ్యక్తిని, నిర్మాతను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: