తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను అలరించిన రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్ దశకు చేరుకుంది. శుక్రవారంతో ఓటింగ్ ప్రక్రియ ముగియటంతో బిగ్ బాస్ హౌస్ లో యాంకర్ శ్రీముఖి గెలిచినట్లు సోషల్ మీడియాలో శ్రీముఖి సీజన్ 3 టైటిల్ విన్నర్ అయినట్లు నాగార్జున దగ్గర ట్రోఫీ అందుకున్నట్లు పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫైనల్ కి శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్వరుణ్ సందేశ్ మరియు అలీ రెజా వెళ్లడం జరిగింది. అయితే వీరిలో హౌస్ నుండి ముందే ఎలిమినేట్ అయ్యి మళ్లీ వైల్డ్ కార్డు ద్వారా అలీ ఎంట్రీ ఇవ్వటంతో అతనిపై పెద్దగా అంచనాలు లేవు. అయితే హౌస్ మొత్తంమీద టైటిల్ విన్నర్ అవ్వటానికి బాగా పోటీ నెలకొంది శ్రీముఖి, రాహుల్ మధ్య అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 


మరోపక్క  వీరిద్దరికి బాబా భాస్కర్ గట్టి పోటీ ఇస్తున్నారు. వరుణ్ సందేశ్ కు ఒక సెక్షన్ నుంచి భారీగా ఓట్లు పడుతున్నా శ్రీముఖి, రాహుల్ స్థాయిని అందుకోలేకపోతున్నట్లు టాక్. కాగా  బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖినే విజేతగా నిలబెట్టడానికి టెలివిజన్ రంగంలో ఉన్న స్టార్ యాక్టర్లు అలాగే శ్రీముఖి అభిమానులు సోషల్ మీడియా టీం కూడా జోరుగా ప్రచారం చేస్తోంది. శుక్రవారం అర్థ రాత్రితో ఓటింగ్ ముగియటంతో తాజాగా శ్రీముఖి బిగ్ బాస్ టైటిల్ గెలిచేసినట్లు, ఆమె టైటిల్ అందుకుని నాగార్జునని కౌగిలించుకున్నట్లు ఉన్న ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.


నిజంగా శ్రీముఖి బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిందా లేక ఇది మార్ఫింగ్ ఫోటోనా అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. ఈ ఫోటో చూసిన కొంతమంది నెటిజన్లు బిగ్ బాస్ వేదిక నుంచి ఫోటో అంత సులువుగా లీక్ కాదు. ఇది తప్పకుండా మార్పింగ్ ఫోటోనే అని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. శ్రీముఖి అభిమానులు ఈ ఫోటో క్రియేట్ చేసి ఉంటారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇలా మార్పింగ్ ఫోటో వల్ల.. ఆల్రెడీ శ్రీముఖి గెలిచేసింది కాబట్టి మిగిలిన వారికి ఓటింగ్ చేసి వృధా అనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలిగించడానికి శ్రీముఖి సోషల్ మీడియా టీం చేసినపని అని మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: