మూడు దశాబ్దాల క్రితమే టాలీవుడ్ లో హీరోయిన్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న అమల మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, రాజశేఖర్ వంటి స్టార్ హీరోల తో నటించింది. ఆ తర్వాత నాగార్జునతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని తర్వాత సినిమాలను తగ్గించేసింది. తెలుగులో 1993 లో ఆగ్రహం సినిమాలో నటించింది. ఆ సినిమా తర్వాత పూర్తిగా సినిమాలకు దూరం అయ్యింది. మళ్లీ రెండు దశాబ్దాల తర్వాత 2012లో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో కనిపించింది. లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ తర్వాత అమల అక్కినేని కంటిన్యూగా సినిమాలు చేస్తారని అందరు అనుకున్నప్పటికి ఎందుకనో మళ్లీ బ్రేక్ తీసుకుంది. 'మనం' సినిమాలో కొన్ని సెకన్లు కనిపించి వెళ్లిపోయారు. ఆ తర్వాత అమల అక్కినేని సినిమాలు చేయలేదు. 

అయితే మళ్లీ ఇన్నాళ్లకు శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ఒక ద్విభాష సినిమాలో కీలక పాత్రను పోషిస్తోందట. శర్వానంద్ కి తల్లి గా అమల నటిస్తున్నట్లు తాజా సమాచారం. శ్రీ కార్తీక్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తుండగా ఇప్పటికే ఈ సినిమాకి  సంబంధించిన సెకండ్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో శర్వానంద్ తో పాటు అమల అక్కినేని కూడా జాయిన్ అయ్యారట. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమాను 2020 లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

ఏడు సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో అమల అక్కినేని రీ ఎంట్రీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా సినిమా క్రేజ్ బాగా పెరుగుతుంది. లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ సినిమాలో నటించి మళ్లీ వెండి తెరపై కనిపించని అమల ఈసారైనా కంటిన్యూగా సినిమాలు చేస్తారా అంటూ అక్కినేని అభిమానులు అనుకుంటున్నారట. సీనియర్ హీరోయిన్స్ చాలా మంది రీ ఎంట్రీ ఇచ్చి అమ్మగా, అత్తగా మంచి పాత్రలు పోషిస్తున్నారు. అందుకే ఈ సినిమా తర్వాత అమల కూడా కంటిన్యూ చేయాలని అక్కినేని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి అమల నిజంగా కంటిన్యూ చేస్తారా లేదా అన్నది అక్కినేని వారు క్లారిటి ఇస్తే ఫ్యాన్స్ సంతోషిస్తారు. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: