సౌత్ ఇండియా స్వీటీ అనుష్క కెరియర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అరుంధతి సినిమా. ఈ సినిమాలో అరుంధతి నటించిన జేజమ్మ క్యారెక్టర్ ఇప్పటికే అందరికీ గుర్తుండే ఉంటుంది. అంతగా మెప్పించింది అరుంధతి సినిమా అనుష్క. ఇటువంటి నేపథ్యంలో అనుష్క నటించిన ఈ సినిమాపై షాకింగ్ కామెంట్ చేసింది శ్రీరెడ్డి. ఇండస్ట్రీలో ఉన్న వారిపై మొదటిలో నిర్మాతలను ఇంకా చాలా మంది ఇతర ప్రముఖులను టార్గెట్ చేస్తూ విమర్శిస్తూ వార్తల్లో నిలిచిన శ్రీ రెడ్డి అప్పట్లో మెగా కుటుంబం పై ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై దారుణమైన కామెంట్లు చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.


ప్రస్తుతం తమిళం ఇండస్ట్రీలో అవకాశాలు కోసం వెతుకుతున్న శ్రీరెడ్డి ఇటీవల రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ నుండి రాజకీయాల్లోకి వెళ్లే వాళ్లనే టార్గెట్ చేస్తే విమర్శనాత్మకమైన కామెంట్ చేయడం మొదలు పెట్టి సోషల్ మీడియాలో తమిళ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. ఇటువంటి తరుణంలో ఇటీవల దీపావళి పండుగ రోజు సందర్భంగా తన ఇంటిలో పూజ చేసుకున్న సందర్భంలో తీసిన వీడియో సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసి ఆ వీడియో కి ఓక అద్భుతమైన ఉపశీర్షిక ని కూడా తనదైన రీతిలో పెట్టుకున్నారు.


ఇకపోతే ఆ ఉపశీర్షిక అనేది ప్రస్తుతానికి సంచలనాలను సృష్టిస్తుంది. ఇంతకీ అదేంటంటే… “అందరు పసుపతుల కోసం నేను సరైన పనే చేశా. నా అమాయక మహిళలు అందరికీ నేను గద్వాల అరుంధతిని” అని కామెంట్ పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో చాలా మంది ఈ వీడియోపై రకరకాల కామెంట్లు పెడుతున్నారు. నిర్మాతలు అయిపోయారు రాజకీయ నాయకులు అయిపోయారు ఇప్పుడు హీరోయిన్ లను టార్గెట్ చేసావా..? శ్రీ రెడ్డి అంటూ కామెంట్లు చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: