బిగ్ బాస్ ఫైనల్ కి వచ్చేసింది. దీంతో హౌస్ లో మరింత ఉత్సాహం తీసుకురావడానికి
బిగ్ బాస్ నిర్వాహకులు
ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలోనే
బిగ్ బాస్ ఇంటి నుండి ఎలిమినేట్ అయిన సభ్యులని మళ్లీ హౌస్ కి పిలిపించి టాప్ ఫైవ్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి కొత్త ఉత్సాహాన్ని తెప్పించడంతో పాటు ప్రేక్షకులకి మరోసారి వారిని పరిచయం చేశాడు. అందరి రాకతో హౌస్ అంతా కళ కళ లాడింది.
బిగ్ బాస్ మళ్ళీ స్టార్ట్ అయిందా అన్నట్లుగా ఉన్న వీరి రాక టాప్ ఫైవ్ మెంబర్స్ కి మంచి ఉత్సాహాన్ని కలిగించింది.
అయితే ఇక్కడ కొన్ని పొరపాట్లు జరిగినట్లుగా తెలుస్తుంది. ఎంట్రీ ఇచ్చాక హౌస్ మెంబర్స్ కనీసం ఒకరినొకరు సరిగ్గా పలకరించుకోలేదు. కొందరైతే మొహాలు పక్కకి తిప్పుకున్నారు. ముఖ్యంగా
రోహిణి, ఆషులు శ్రీముఖితో మాట్లాడినట్టు కనిపించలేదు.అలాగే తమన్నాతో
రోహిణి, పునర్నవి మాట్లాడలేదు. దీన్ని బట్టి వీరింకా హౌస్ లో జరిగిన వాటిని మనసులో పెట్టుకున్నారని అర్థం అవుతుంది.
ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యులు మళ్ళీ హౌస్ కి వచ్చినపుడు వారిలో కొందరి ప్రవర్తన కొంచెం అతిగా అనిపించింది. ఎంట్రీ దగ్గర కానీ, హౌస్ లో కానీ అవసరానికి మించి ఎక్కువ యాక్షన్ చేశారేమో అన్నట్టుగా ఉంది.
తమన్నా, జాఫర్,
శివజ్యోతి,
హేమ మొదలగు వారు అవసరానికి మించి చేసినట్టుగా తెలుస్తుంది. కొన్ని అనఫిషియల్స్ ఓట్ల ప్రకారం
రాహుల్ కి ఎక్కువ ఓట్లు వచ్చాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ విషయం తెలుసుకున్న ఎలిమినేటెడ్ సభ్యులు వచ్చీ రాగానే
రాహుల్ పక్కన వాలిపోవడం విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే వీరే హౌస్ లో ఉన్నప్పుడు
రాహుల్ గురించి నెగెటివ్ గా మాట్లాడారు. బయట
ఆడియన్స్ కంటే హౌస్ లో పరిస్థితి ఏంటనేది వీరికే ఎక్కువ తెలుస్తుంది. అయినా వారి స్వంత అభిప్రాయానికి కట్టుబడి ఉండకుండా
ఆడియన్స్ నిర్ణయానికి లోబడి ఇలా చేయడం సమంజసంగా అనిపించలేదు.