క్రైస్తవ మత ప్రభోదకులు కేఏ పాల్ అంటే ఒకప్పుడు జనాలకు ఎంత తెలుసో తెలియదో కానీ..ఇటీవల జరిగిన ఏపి ఎన్నికల పుణ్యామా అని తెలుగు రాష్ట్రాల్లో తనదైన కామెడీతో ప్రతిరోజూ విరగడి నవ్వేలా చేశారు.  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రాష్ట్రంలో ఎన్నికల్లో తన సత్తా చాటుతానని..వైసీపీ, టీడీపీ,జనసేన అన్ని పార్టీ నేతలు తన ముందు బలాదూర్ అంటూ తెగ ప్రచారం చేశారు.  అయితే మొదటి నుంచి ఆ పార్టీపై ఎన్నో కాంట్రవర్సీలు నడుస్తూ వచ్చాయి.  ముఖ్యంగా ఈ పార్టీ గుర్తు అచ్చం వైసీపీ కలర్ ని కలిగి ఉండటం.  అలాగే హెలికాప్టర్ గుర్తు పై కూడా ఎన్నో అభ్యంతరాలు వచ్చాయి.

అంతే కాదు మ పార్టీకి చెందిన బీ ఫారాలను టిడిపి,వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థులు ఎత్తుకెళ్లారని, ఆ బీ ఫారాల సాయంతో పలు చోట్ల టిడిపి,వైఎస్‌ఆర్‌సిపి తమ అభ్యర్థులను నిలబెట్టాయని పాల్ ఆరోపించారు. ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అయిన సందర్భంగా పాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు.  ఏది ఏమైనా ఏపిలో జరిగిన ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడటమే కాదు...కొన్ని చోట్ల కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు.  ఇలా ఎన్నికల్లో తన ప్రసంగాలు, గొడవలు, హావభావాలతో కేఏ పాల్ సెంట్రల్ ఎట్రాక్షన్ గా మిగిలిరు. 

తాజాగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేసి సంచలనం సృస్టించారు.   తాజాగా కేఏపాల్‌పై స్పెష‌ల్ వీడియో రూపొందించి త‌న ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో కేఏపాల్ చేసిన కామెంట్స్‌ని అందులో పొందుప‌ర‌చి వీడియో సాంగ్‌గా విడుద‌ల చేశారు.  ఈ సాంగ్ లో కేఏ పాల్ అన్న వ్యాఖ్యలు, ప్రసంగాలు అన్నీ సంక్షిప్తంగా తీసుకొని సాంగ్ క్రియేట్ చేసి దుమ్మురేపారు.  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటుచేసుకున్న వివాదాస్పద అంశాల్ని స్పృశిస్తూ రామ్‌గోపాల్‌వర్మ రూపొందించారని అర్థమవుతున్నది.  మొత్తానికి ఈ సాంగ్ చూస్తే మళ్లీ పడీ పడీ నవ్వేలా కనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: