టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన
అజ్ఞాతవాసి సినిమా తరువాత తన
సినిమా రంగ జీవితానికి పూర్తిగా గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ
సినిమా అప్పట్లో ఘోరంగా ఫ్లాప్ కావడంతో
పవన్ ఫ్యాన్స్ మాత్రం ఎంతో నిరాశకు గురయ్యారు. ఇక ఆ తరువాత నుండి తాను నెలకొల్పిన
జనసేన పార్టీ కార్యకలాపాల్లో మునిగిపోయిన
పవన్, ఇటీవల జరిగిన ఎన్నికల్లో
ఏపీ తరపున రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇక అక్కడినుండి తన పార్టీపై మరింతగా దృష్టిపెట్టిన
పవన్, సినిమాల్లోకి కూడా రీఎంట్రీ ఇస్తున్నట్లు కొద్దిరోజలుగా వార్తలు పలు
మీడియా మాధ్యమాల్లో విపరీతంగా హల్ చల్ చేస్తున్నాయి.
అయితే మధ్యలో ఆయనకు
త్రివిక్రమ్,
సురేందర్ రెడ్డి, క్రిష్ వంటి దర్శకులు కొన్ని కథలు వినిపించారని, కాగా వారిలో
క్రిష్ చెప్పిన కథ తనకు ఎంతో నచ్చడంతో
పవన్ ఓకే కూడా చెప్పారని నిన్నటి నుండి వార్తలు విపరీతంగా రావడం జరిగింది. ఇకపోతే నేడు వీటన్నిటికీ స్వస్తి చెప్తూ, ఏకంగా
పవన్ నటించబోయే తన తదుపరి 26వ
సినిమా పై అధికారిక ప్రకటన బయటకు రావడం జరిగింది.
బాలీవుడ్ కు చెందిన ప్రముఖ
సినిమా క్రిటిక్ తరణ్
ఆదర్శ్, కొద్దిసేపటి క్రితం
పవన్ కళ్యాణ్ చేయబోయే తదుపరి సినిమాపై సంచలన ప్రకటన రిలీజ్ చేసారు.
ఇటీవల
బాలీవుడ్ లో
అమితాబ్ బచ్చన్ మరియు తాప్సి ప్రధాన పాత్రల్లో రూపొంది మంచి
సక్సెస్ సాధించిన పింక్
సినిమా అధికారిక తెలుగు రీమేమ్ లో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించబోతున్నారని, అలానే ఈ సినిమాకు దర్శకుడిగా గతంలో దిల్ రాజు బ్యానర్ లో పని చేసిన వేణు
శ్రీరామ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారని తరణ్ తన పోస్ట్ లో తెల్పడం జరిగింది. ఇక ఈ సినిమాను దివంగత నటి
శ్రీదేవి భర్త బోనీ కపూర్ మరియు దిల్ రాజు కలిసి సంయుక్తంగా నిర్మిస్తారట. నేడో, రేపు ఈ సినిమాకు సంబంధించి పూర్తి విషయాలు బయటకు రానున్నాయి. ఇక ఈ న్యూస్ బయటకు వచ్చిన దగ్గరినుండి
పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆనందంతో సంబరపడిపోతున్నారు.....!!