పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పిన తర్వాత తాజాగా  నిర్మాత దిల్ రాజు సినిమాలో పవన్  నటిస్తున్నారు అంటూ వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. బాలీవుడ్ హిట్ మూవీ పింక్  సినిమాలో అమితాబ్ బచ్చన్ నటించిన పాత్రలో తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నట్లు   వార్తలు సినీవర్గాల్లో ఎక్కువగా వినిపిస్తుంది. అయితే గతంలో టాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగిన పవన్ కళ్యాణ్... ఆ తర్వాత జనసేవ చేయాలని భావించి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అయితే రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పారు పవర్ స్టార్  పవన్ కళ్యాణ్  ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాల్లో బాగా రాణించినట్లుగానే  రాజకీయాల్లో కూడా తన ప్రభావం చూపి రాజకీయాలను ప్రభావితం చేస్తారని అందరూ అనుకున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది జనసేన పార్టీలోకి చేరారు. 



 2014 లో జరిగిన ఎలక్షన్లలో జనసేన ఎన్నికల్లో పోటీ చేయలేదు కానీ టిడిపికి మద్దతు ప్రకటించింది. ఇక తాజాగా జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసింది... ఎన్నికల ముందు ప్రచారంలో కూడా పవన్ కళ్యాణ్ తన మార్క్  చూపించారు. ఈ క్రమంలో ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన  పార్టీ మంచి మెజారిటీ సాధిస్తుందని అందరూ అంచనా వేశారు... కానీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అంచనాలను తారుమారు చేస్తూ కనీసం కనీస సీట్లు కూడా గెలుచుకోలేకపోయింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ కి ఒక్కటంటే ఒక్కటి సీట్లు మాత్రమే వచ్చింది. దీంతో గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోవడంతో మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వస్తారంటూ  వార్తలు వచ్చాయి. కానీ తాను జన  సేవకే అంకితం అని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. 



 ఈ నేపథ్యంలో తాజాగా సినిమాలకు దూరంగా ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ న త్వరలోనే దిల్రాజు నిర్మిస్తున్న కొత్త సినిమాలో నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే పవన్ కళ్యాణ్ కూడా కూడా దిల్ రాజు  సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ పవన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. పవన్ కళ్యాణ్ సినిమా తెరకెక్కించబోతున్నారంటూ  అధికారికంగా ప్రకటించాడు . బాలీవుడ్ సినిమా పింక్ రీమేక్ చేసిన బోనికపూర్ ఇప్పుడు దిల్ రాజుతో  తో చేతులు కలిపారు . పింక్ ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ నటిస్తుండగా..  ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు  దర్శకత్వం వహించబోతున్నారు. అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఇదే అంటూ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేసారు. తరుణ్ ఆదర్శ్ ట్విట్  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ట్విట్ తో పవన్ అభిమానులు   సంబరపడిపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: