టాలీవుడ్ వన్ ఆఫ్ ది స్టార్
ప్రొడ్యూసర్ దిల్ రాజు
సూపర్ స్టార్ మహేష్ తో వరుసగా సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
మహర్షి తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాని
అనిల్ సుంకరతో కలిసి నిర్మిస్తున్నారు. అయితే ఈ
సినిమా తర్వాత కూడా
మహేష్ తో దిల్ రాజు సినిమాల్ని కంటిన్యూ చేస్తారా? అంటే కష్టమేనని తెలుస్తోంది. ఇదే ఈ ఇద్దరు కలిసి చేసే లాస్ట్ ఫిల్మ్ అని ఫిల్మ్
నగర్ లో చెప్పుకుంటున్నారు. అయితే అందుకు కారణాలు కూడా లేకపోలేదు.
దిల్ రాజు కు
మహేష్ తో సినిమాలు కావాలట. కానీమహేష్ పెట్టే కండిషన్లకు మాత్రం నాట్ ఓకే అని అంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హిట్లు ఉన్న దర్శకులకు
మహేష్ వరుసగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు.
వంశీ పైడిపల్లి-
సురేందర్ రెడ్డి వంటి స్టార్ డైరెక్టర్లకు ఇప్పటికే ఓకే చెప్పేశారు. ఈ రెండు సినిమాల్ని దిల్ రాజుతో కలిసి కోప్రొడ్యూస్ చేసేందుకు
మహేష్ ఆసక్తి చూపిస్తున్నారట. అయితే రాజు మాత్రం వెనకడుగు వేస్తున్నారన్న వార్తలు ఫిల్మ్
నగర్ సర్కిల్ లో వినిపిస్తున్నాయి.
మహేష్ తో
సినిమా కావాలి.. కానీ నో కండిషన్స్ అనేస్తున్నారట. ఇక
మహేష్ ఎవరితో
సినిమా చేయాలనుకున్నా ముందుగా కండిషన్స్ అప్లయ్ అని ఖరాకండిగా చెప్పేస్తుండడంతో ఇక దిల్ రాజుతో జర్నీకి బ్రేక్ పడబోతోందని అంటున్నారు. ఇప్పటికే
మహేష్ నటిస్తున్న ప్రతి
సినిమా పోస్టర్ పైనా జి.మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్స్ లోగో ఖచ్చితంగా ఉంటోంది.
నిర్మాత ఎవరైనా
మహేష్ భాగస్వామ్యం తప్పనిసరి. దాంతో పాటు కండీషన్లు అప్లయ్ అనేస్తుండడంతో దిల్ రాజు అందుకు ఆసక్తిగా లేరని తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మన
మహేష్ బాబు గాని లేదా దిల్ రాజు గాని క్లారిటి ఇస్తే ఇవి గాసిప్సా లేక నిజమేనా అని తెలిసే అవకాశముంది.