నాగార్జున వ్యాఖ్యాత‌గా వంద‌రోజులకు పైన సాగిన రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 3 కి నేడు బిగ్ డే అని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల‌లో అత్యంత ఆద‌ర‌ణ పొందిన బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 3 గ్రాండ్ ఫైన‌ల్ నేడు జ‌ర‌గ‌నుంది. సాయంత్రం ఆరు గంట‌ల‌కు మొద‌లు కానున్న ఈ కార్య‌క్ర‌మం కోసం ఈ షో అభిమానులంతా టీవీల‌కు అతుక్కుపోయి ఆతృత‌తో ఎదురు చూస్తారు. ఇక ఫైనల్ కు చేరిన రాహుల్, శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్, అలీ రెజాలలో ఒకరు టైటిల్ విన్నర్ గా నిలవనున్నారు. మరి ఇంత పెద్ద ఈవెంట్ కి అతిథులు గా ఎవరు రానున్నారో తెలుసా?
బ్యూటీ రాశి ఖన్నా, దర్శకుడు మారుతీ ఈ షో కి ప్రత్యేక అతిధులుగా రానున్నారు.

ప్రతి రోజూ పండగే చిత్రానికి వీరిద్దరూ కలిసి పనిచేస్తున్న తరుణంలో ఈ చిత్ర యూనిట్ ఈ షోకి అతిధులు హాజరుకానున్నారని చెప్పవచ్చు. గత సీజన్ లో బిగ్ బాస్ ఫైనల్ కి అతిథిగా విక్టరీ వెంకటేష్ వచ్చారు. కాగా ఈ సీజన్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలిచేది రాహుల్ అంటూ సోషల్ మాధ్యమాలలో ప్రముఖంగా వినిపిస్తున్న వార్త.


ఇక ఈ గ్రాండ్ ఫినాలేకు అతిధిగా విచ్చేసి ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు రెడీ అయిపోతుంది ఇస్తార్ట్ భామ నిధి అగ‌ర్వాల్‌. త‌న డాన్స్ ప‌ర్ఫార్మెన్స్‌తో బిగ్‌బాస్ స్టేజ్‌ను అద‌ర‌గొట్టేందుకు సిద్ధంగా ఉంది. ఆమె అంద‌చందాల‌తో కుర్ర‌కారును రెచ్చ‌గొడుతుంది. ఇకపోతే ఈ భామ గ‌తంలో అక్కినేని వార‌సులు ఇద్ద‌రితోనూ క‌లిసి న‌టించింది. నాగ‌చైత‌న్య‌తో స‌వ్య‌సాచి అఖిల్‌తో మజ్ను చిత్రాల్లో న‌టించింది. ఇప్పుడేమో నాగార్జున హోస్ట్‌గా ఉన్న ప్రాగ్రామ్‌కి  నిధి గెస్ట్‌గా వెళ్ళి డాన్స్ చేయ‌నుంది అంటే వీరి ఫ్యామిలీతో నిధికి గ‌ట్టి సంబంధ‌మే ఉన్న‌ట్లు భావిస్తున్నారు కొంద‌రు. 


మరింత సమాచారం తెలుసుకోండి: