యాంగ్రీ హీరో కార్తి కథానాయకుడిగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌ నిర్మించిన డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'ఖైదీ'. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ కె.కె.రాధామోహన్‌ సమర్పించారు. దీపావళి కానుకగా అక్టోబర్‌ 25న ప్రపంచవ్యాప్తంగా విడుద‌లై అన్నిచోట్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్‌తో హౌస్ ఫుల్ కలెక్షన్స్‌ సాధిస్తోన్న ఈ సినిమా పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ విధంగా  స్పందించి కార్తి న‌టించిన ఖైదీ చిత్రం చాలా కొత్త‌గా ఉంద‌ని. థ్రిల్లింగ్ యాక్ష‌న్ సీక్వెన్స్‌లో కార్తి న‌ట‌న అద్భుత‌మంటూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. అంతేకాక ద‌ర్శ‌కుడు ఈ చిత్రంలో ఒక్క పాట‌కూడా పెట్ట‌కుండా చాలా కొత్త‌గా ఒక ట్రెండ్‌ని సృష్టించార‌ని కూడా ఉన్నార‌ని  సినిమా మొత్తం అద్భుత‌మైన క‌థ‌తో ప్రేక్ష‌కుడ్ని ఆక‌ట్టుకుంద‌ని అన్నారు. దీనికి కార్తి 
ప్ర‌తిస్పందించారు ఇంత అద్భుత‌మైన ఫ‌లితాల‌ను ఇచ్చి ఇంత పెద్ద విజ‌య‌వంతం చేసినందుకు ప్ర‌తి ఒక్క‌రికి ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 


యాంగ్రీ హీరో కార్తి  మాట్లాడుతూ - "ఖైదీ' చిత్రం పట్ల మీరు చూపించే ప్రేమ,  మీరు అందించిన ప్రశంసలకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియ‌డం లేదు.  ఒక ఎగ్జైటింగ్ స్టోరీని మీకు అందించాలనే లక్ష్యంతో నేను మా టీమ్ మనసు పెట్టి హార్డ్ వర్క్ చేశాం.  కానీ మేము ఈ స్థాయిలో రెస్పాన్స్ ఎక్స్‌పెక్ట్  చేయలేదు. మా చిత్రాన్ని చూసి అభినందించిన మహేష్ బాబు గారికి థాంక్స్. తన ప్రశంసలతో టీమ్ అంతా థ్రిల్ అయ్యారు. ఈ సినిమాని అభినందిస్తూ అందరిలోకీ తీసుకెళ్ళిన మీడియా వారికి ధన్యవాదాలు. ఇంత గొప్ప విజయాన్ని అందించినందుకు అభిమానులకి, ప్రేక్షకులకి హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి కోసం ఢిల్లీ మళ్ళీ వస్తాడు. "  అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: