నాయక్ సినిమాలో రామ్ చరణ్ సరసన నటించిన ముద్దగుమ్మ అమల పాల్, ఎపుడూ ఏదో ఒక చిపిలి చేష్ట చేసి అందరి విమర్శలును ఎదుర్కుంటుంది. ఇదే అలవాటు గా ఈ రఘువరన్ బి.టెక్ భామ ఇంకో చిలిపి చేష్ట చేసింది. అవును ! తను ఒక దెయ్యం అవతారంలో దిగిన ఫోటో ని ఆమె సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. అక్టోబర్ 31న హాలోవిన్ డే సందర్బంగా అమల పాల్ దెయ్యం లాగా రెడీ అయ్యి తన పాచ్యాత్య దేశ స్నేహితులతో ఎంతో జాలీ గా గడిపారు. 


అయితే ఆ ఫొటోస్ ని ఇంటర్నెట్ లో షేర్ చేసిన తర్వాత నెటిజన్స్ చాలా కోపం గా స్పందిస్తున్నారు. హాలోవిన్ డే ని కేవలం పాశ్చత్య దేశాలవారే జరుపుకోవాలని, కానీ భారతీయురాలు అయినా అమల పాల్ ఆ డే లో పాల్గొని మన సంస్కృతిని నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళ సంస్కృతిని ప్రచారం చేస్తుందని దుయ్యబడుతున్నారు.


ఇక తన విడాకులు అయినా సమయం నుంచి అమల పాల్ తీవ్రంగా ట్రోల్ గా గురవుతూనే ఉన్నారు. కొంత మంది ఉన్న కొంచెం అందాన్ని పాడుచేసుకోకు అని వెంటకారం ఆడుతుంటే మరికొందరు 'హాట్ దెయ్యం' అని వ్యాఖ్యలు చేస్తున్నారు. 


ఏది ఏమైనా విడాకులు అయినాక తాను ఎంతో స్వేచ్తగా ఉంటున్నానని పలు సందర్భాలలో ఆమె చెప్పుకొచ్చారు. ఇక ఆమె నటించిన 'ఆమె' సినిమాలో పూర్తి నగ్నంగా కనిపించి ఓ పెద్ద దుమారమే లేపారు. ఈ సినిమాలో తన సహజ నటి అయినా వీజే రమ్యను అమలు పాల్ ముద్దుపెట్టుకుంది. ఇదేం విడ్డురం రా బాబు అని సినీ అభిమానులు ముక్కున వేలేసుకుంటుంటే.. అమ్మాయిలు అమ్మాయిలు ముద్దుపెట్టుకుంటే తప్పేంటి? అని ప్రశ్నించింది ఈ అందాలతార.


మరింత సమాచారం తెలుసుకోండి: