టాలీవుడ్ పవర్ స్టార్ గా పేరుగాంచిన పవన్ కళ్యాణ్, గత ఏడాది జనవరిలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమాతో తన సినీ జీవితానికి విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. పవన్ కెరీర్ 25వ సినిమాగా త్రివిక్రమ్ తెరకెక్కించిన అజ్ఞాతవాసి, రిలీజ్ తరువాత టాలీవుడ్ అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచి పవన్ ఫ్యాన్స్ కి ఎంతో పెద్ద షాక్ ని ఇచ్చింది. అయితే ఆ తరువాత పూర్తిగా రాజకీయాలకు పరిమితమైన పవన్, ఇటీవల 26వ సినిమాలో నటిస్తున్నట్లు బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ప్రకటించడం జరిగింది. ఇటీవల బాలీవుడ్లో రిలీజ్ అయిన పింక్ సినిమాను తెలుగులో పవన్ హీరోగా బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. 

హిందీలో అమితాబ్ బచ్చన్ మరియు తాప్సి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు వర్షన్ లో పవన్ మెయిన్ రోల్ పోషిస్తుండగా, మిగతా పాత్రల ఎంపిక అప్పుడే మొదలయిందట. ఇకపోతే ఈ సినిమా కోసం అతి ముఖ్యమైన కోర్ట్ సీన్ తాలూకు భారీ సెట్టింగుని కట్టడం నేటి నుండి మొదలెట్టినట్లు టాలీవుడ్ వర్గాల టాక్. ఎంతో గ్రాండ్ లెవెల్ లో ఈ సెట్ డిజైన్ జరుగుతోందని, అలానే అతి త్వరలో సినిమాలోని ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు కూడా వెల్లడి కానున్నాయని అంటున్నారు. 

అయితే ఈ సినిమా ఇటీవల తమిళ్ లో అజిత్ హీరోగా రీమేక్ అయి మంచి హిట్ సాధించడం విశేషం. కాగా పవన్ సరసన ప్రముఖ స్టార్ హీరోయిన్ ఒకరు నటించబోతున్న ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ బల్క్ గా డేట్స్ ని కేటాయించినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి, ఆ తరువాత తన రాజకీయ వ్యవహారాల్లో బిజీ కానున్నారట పవన్. దిల్ రాజు బ్యానర్ లో ఓ మై ఫ్రెండ్, ఎంసీఏ సినిమాలు తీసిన వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. మరి పవన్ కంబ్యాక్ మూవీగా రాబోతున్న ఈ సినిమా, ఆయనకు ఎంతటి విజయాన్ని అందిస్తుందో చూడాలి...!!


మరింత సమాచారం తెలుసుకోండి: