టాలీవుడ్ లో అప్పట్లో అందాల తారల్లో ఒకరిగా మంచి పేరు తెచ్చుకుంది ఛార్మి. ‘నీతోడు కావాలి’ తెలుగు సినిమా..అప్పటికి ఛార్మీ వయసు కేవలం పద్నాలు సంవత్సరాలు మాత్రమే. ప్పటికి ఆమె ఇంకా స్కూలు చదువుల్లోనే ఉండటం వలన సెలవులలో మాత్రమే నటించే షరతుపై ఆ మూవీలో నటించింది. ఛార్మికి వెంటనే కాదల్ కిసు కిసు అనే
తమిళ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రం విజయవంతమవ్వటంతో ఆమెకు వెను వెంటనే కాదల్ అళివతిల్లై, ఆహా, ఎత్న అళగు
తమిళ చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. అవి కూడా చెప్పుకోదగ్గ విజయం సాధించటంతో ఆమె ప్రముఖ తెలుగు దర్శకుడు
కృష్ణ వంశీ దృష్టిలో పడింది.
కృష్ణవంశీ తన శ్రీ ఆంజనేయం
మూవీ ద్వారా ఛార్మిని తెలుగు తెరకు తిరిగి పరిచయం చేశాడు. ఈ మూవీలో ఛార్మీ విపరీతమైన గ్లామర్ షో ప్రదర్శించింది. తర్వాత ఎన్నో గ్లామర్ తరహా పాత్రల్లో నటించిన ఛార్మీ ఆ మద్య ఐటమ్ సాంగ్స్ లోకూడా నటించింది. ప్రస్తుతం నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ఇటీవల
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో
రామ్ పోతినేని నటించిన ‘ఇస్మార్ట్
శంకర్ ’సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ
మూవీ మంచి
సక్సెస్ సాధించడంతో ఛార్మీ మరిన్ని సినిమాలు నిర్మించబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్.
ప్రస్తుతం ఛార్మీ ఫిట్ నెస్ పై దృష్టి సారిస్తుందట. బొద్దుగుమ్మ చార్మీ నాజూగ్గా తయారవ్వాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారట. అందుకోసం సామాన్యమైన వ్యాయామాలను నమ్ముకోకుండా, పవర్ యోగాను చార్మీ బాగా నమ్ముకుందట. సాధారణ వ్యాయామాలు చేస్తే సన్నగా తయారవ్వవచ్చు కానీ, అదే సమయంలో ముఖంలో మార్పులొచ్చేస్తాయి. పవర్ యోగాతో అందంలో ఏ మార్పు ఉండదట.
ప్రస్తుతం
రొమాంటిక్ అనే సినిమాని పూరీ జగన్నాథ్ తన కుమారుడు హీరోగా నిర్మిస్తూండగా, ఈ సినిమాకి సంబంధించిన విశేషాలని ఎప్పటికప్పుడు తన
ట్విట్టర్ ద్వారా అభిమానులకి చేరవేస్తోంది ఛార్మీ. గోవాలో
రొమాంటిక్ చిత్రం లాస్ట్ షెడ్యూల్ లో ఉన్న ఆమె యోగాసనాలు వేస్తోంది. ఆ ఫోజులను తన అభిమానులతో షేర్ చేసుకుంది. అయితే ఛార్మీ మళ్లీ
హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా ఎంటీ అని
టాలీవుడ్ వర్గాల్లో గుస గుస.