టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అపజయమెరుగని దర్శకుడిగా పేరుగాంచిన యువ దర్శకుడు
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే కమర్షియల్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా
గంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ
సినిమా సంక్రాంతి కానుకగా
జనవరి 12న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే రెండు వరుస విజయాలు తన ఖాతాలో వేసుకున్న
సూపర్ స్టార్, దీనితో హ్యాట్రిక్ విజయాన్ని కూడా అందుకోవాలని ఎంతో కసిగా పని చేస్తున్నట్లు టాక్.
ఇకపోతే ఈ
సినిమా తరువాత
మహేష్ బాబు మూడు నెలలపటు సినిమాలకు విరామం ప్రకటించనున్నట్లు ఇటీవల ఆయన
భార్య నమ్రత గారు ఒక పత్రికతో మాట్లాడుతూ చెప్పారు. అయితే
మహేష్ బాబు అంత భారీ గ్యాప్ తీసుకోవడానికి ఒక షాకింగ్ కారణం ఉందట. అదేమిటంటే కొద్దిరోజులుగా మైగ్రేన్ తలనొప్పితో ఎంతో బాధపడ్డాను అని ఇటీవల
మహేష్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే మధ్యలో దానికి చికిత్స తీసుకోగా తగ్గిపోయిందని, కానీ మళ్లీ కొన్నాళ్లుగా ఆ తలనొప్పి తనను ఎంతగానో బాదిస్తుండడంతో, డాక్టర్లు కొద్దిరోజుల పాటు ఆయనను పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని చెప్పారట.
ఇక ఈ మధ్యలోని మూడు నెలల కాలంలో శారీరకంగా మరియు మానసికంగా తనను తాను మరింతగా ఉల్లాసంగా మార్చుకునేందుకు
మహేష్ బాబు సిద్ధమవుతున్నారట. అయితే ఆ సమయంలో పలువురు దర్శకుల నుండి కథలు వినటానికి మాత్రం
మహేష్ బాబు నిర్ణయించారట. అయితే ఆ విధంగా తన వద్దకు వచ్చిన దర్శకులు చెప్పన కథల్లో, తనకు నచ్చిన కథని ఎంపిక చేసి తదుపరి సినిమాగా దాని మొదలు పెట్టడం జరుగుతుందని సమాచారం. సో దీనిని బట్టి సరిలేరు నీకెవ్వరు
సినిమా తర్వాత అభిమానులకు
మహేష్ బాబు దర్శనం లభించేది మే నెల తర్వాతనే అని అర్థం అవుతోంది. ఒకరకంగా
మహేష్ ఫ్యాన్స్ కి ఇది కొంత ఇబ్బంది కలిగించే వార్తే అంటున్నారు సినీ విశ్లేషకులు...!!