రాజమౌళి తెరకెక్కించిన
బాహుబలి సినిమా సృష్ఠించిన సంచలనాల గురించి తెలిసిందే. తెలుగు
సినిమా స్థాయిన అమాంతం పెంచేసిన అద్భుతమైన ప్రయత్నం.
ఆ తర్వాత పాన్
ఇండియా కేటగిరీలో సినిమాల రూపుదిద్దుకోవడం ఈ సినిమాతోనే మొదలు. ఇక
బాహుబలి సినిమాలోని పాపులర్ క్యారెక్టర్ శివగామి పాత్రకి పరిపూర్ణతను చేకూరుస్తూ
రాణి శివగామి అనే ఫిక్షన్ డ్రామాని అందించేందుకు ఇండస్ట్రీలో మరో ప్రయత్నం జరుగుతోంది. రమ్యకృష్ణ టైటిల్ పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం
రాణి శివగామి. మధు.ఎం
రచన, దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ పిక్చర్స్ పతాకంపై
మురళీకృష్ణ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయిన ఈ
సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్దమవుతోంది.
ఇక ఈ
సినిమా కోసం కథను 9వ శతాబ్ధంలో రాణికి.. 21వ శతాబ్ధంతో ఉన్న కనెక్షన్ ఏమిటి? అన్నదే
సినిమా కథాంశం అని తెలుస్తోంది. హారర్ ఫిక్షన్ డ్రామా నేపథ్యంలో
రాణి శివగామి పాత్రలో రమ్యకృష్ణ పవర్ ఫుల్ గా కనిపిస్తారట. నీలాంబరి(నరసింహా) తరహాలో మరోసారి అదిరిపోయే పాత్రలో
రమ్య నటించారని చిత్ర యూనిట్ చెప్పుకుంటున్నారు. తెలుగు-తమిళం-కన్నడలో ఈ
సినిమా ఒకే సారి రిలీజ్ చేయనున్నారట. రమ్యకృష్ణ-
ప్రవీణ్ తేజ్- పాయల్-
రవి కాలే-గోలిసోడా
కీర్తి మధు- అవినాష్- రోలర్ రఘు మధుమణి- మిమిక్రీ రితేష్- రంగన్న తదితరులు ఈ సినిమాలో ఇతర పాత్రల్లో నటించారు.
ఇక
బాహుబలి రిలీజ్ తర్వాత శివగామి పాత్రతో ఆర్కా
మీడియా సంస్థ ఓ
టీవీ సీరియల్ ని నిర్మించింది. అలాగే
బాహుబలి పాత్రల టాయ్స్ అమ్మకాలు.. ఆ తర్వాత యానిమేషన్ గేమింగ్
బిజినెస్ గురించి తెలిసిందే. ఇప్పటికీ
జపాన్ లాంటి చోట
బాహుబలి టాయ్స్ అమ్మకాలు ఇంకా సాగుతున్నాయి. అంతేకాదు ఈ సినిమాలోని పాత్రల్ని ఆధారంగా చేసుకుని సినిమాలు రూపొందించేందుకు ప్రయత్నించడం ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.