బుల్లి తెరపైన తనకంటూ ఓ సెపరేట్ గుర్తింపు తెచ్చుకున్న
శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3 లో రన్నర్ అప్ గా నిలిచింది. సీజన్ 3 టైటిల్ ని గెలుచుకున్న
రాహుల్ సిప్లిగంజ్ 50 లక్షల
ప్రైజ్ మనీ ని గెలుచుకున్నాడు. కానీ రన్నర్ అప్ గా నిలిచిన
శ్రీముఖి మాత్రం రూ 1.05 కోట్ల
చెక్ అందుకున్నట్లు సమాచారం. ఇందుకు కారణం
శ్రీముఖి బిగ్ బాస్ నిర్వాహకులతో హౌస్లో ఉండేందుకు రోజుకు రూ. 1 లక్ష ఇచ్చేలా కాంట్రాక్టు పెట్టుకోవడం.
శ్రీముఖి 105 రోజులు
బిగ్ బాస్ 3 హౌస్ లో విజయవంతంగా కొనసాగడం వలన కాంట్రాక్టు ప్రకారం రూ 1.05 కోట్ల రెమ్యూనరేషన్
చెక్ బిగ్ బాస్ టీమ్ ఆమెకు సమర్పించింది.
శ్రీముఖి హైయెస్ట్ పెయిడ్ నటి కావడంతో ఆమె అడిగినంత ఇవ్వడానికి సిద్ధమై కాంట్రాక్టు పై సంతకం చేసినట్లు నిర్వాహకులు చెప్తున్నారు. ఈమె అందుకున్న మనీ
బిగ్ బాస్ సీజన్ 3 లోని కంటెస్టెంట్లు ఒక్కొక్కరు గెలుచుకున్న డబ్బు కంటే చాలా ఎక్కవ అవ్వడం ఆసక్తిని రేపుతోంది. ఇక హ్యాపీ డేస్
హీరో అయినా
వరుణ్ సందేశ్ అతని భార్యకు కూడా బాగానే రెమ్యూనరేషన్ అందినట్లు తెలుస్తుంది. సీజన్ 3 కి హోస్ట్ గా కనిపించిన అక్కినేని
నాగార్జున రూ. 5 కోట్ల పైనే అందుకున్నట్లు సమాచారం.
కోట్లాది అభిమానులతో సహా తెలుగు నటి వ్యాఖ్యాత అయినా ఝాన్సీ కూడా
బిగ్ బాస్ ఫలితం పై నిరాశని వ్యక్తం చేస్తున్నారు. అయినా..
బిగ్ బాస్ షో నుంచి బయట అడుగుపెట్టగానే
శ్రీముఖి కోటీశ్వరురాలు అయ్యారనే విషయం చాలా మంది అభిమానులకు సంతృప్తి కలిగిస్తుంది. నిజం చెప్పాలంటే
బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్లంతా బాగా పాపులర్ అవుతారు. ఈ విధంగా చూసుకుంటే
శ్రీముఖి కి డబ్బు తో సహా మంచి పాపులారిటీ వచ్చి బాగా లాభపడిందనుకోవచ్చు.