ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠ పురంబులో సినిమా షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి జనవరి 12వ తారీకున విడుదల కానుంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే సుకుమార్ సినిమా కోసం రెడీ అవుతున్నారు అల్లు అర్జున్. ఈ క్రమంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల మొదలుపెట్టిన సినిమా యూనిట్ త్వరలోనే సినిమా షూటింగ్ మొత్తం పగడ్బందీ షెడ్యూల్ రెడీ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా రంగస్థలం లాంటి అదిరిపోయే హిట్ మెగా అభిమానులకు సుకుమార్ అందించడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు పెట్టుకుంటున్నారు.


ఇదిలా ఉండగా బన్నీతో సుకుమార్ తీసిన ఈ సినిమా గంధపు చెక్క స్మగ్లింగ్ నేపథ్యంలో ఉండబోతున్నట్లు సినిమా ప్రారంభం అవుతున్న మొదటిలో ఫిలింనగర్ లో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాని నిర్మిస్తున్న మైత్రి మూవీస్ సంస్థ విడుదల చేసిన ప్రకటన చూస్తే కచ్చితంగా ఇది గంధపుచెక్క స్మగ్లింగ్ కి సంబంధించిన స్టోరీ అన్నట్టుగా నిజమే అని అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ విపరీతంగా జరుగుతుంది.


అక్కడ లోకల్ గా ఉండే వ్యక్తులని ఎర్రచందనం అక్రమ రవాణాకు ఉపయోగిస్తారు. తాజాగా మైత్రి మూవీస్ సంస్థ అల్లు అర్జున్ 20వ చిత్రానికి క్యాస్టింగ్ కాల్ ప్రకటన చేసింది. చిత్తూరు యాసలో అద్భుతంగా మాట్లాడగలిగే నటులు ఆడిషన్స్ కు రావాలని ఆహ్వానించింది. దీనితో ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరక్కబోతోందంటూ అభిమానులు డిసైడ్ అయిపోతున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో అల్లు అర్జున్ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడని సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: