టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరూ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మహర్షి వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత మహేష్ బాబు నటిస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరూ కావడంతో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో అంచనాలు వేసేసుకున్నారు. అయితే ఈ సినిమాతో విజయశాంతి కూడా రీఎంట్రీ ఇస్తుంది. అయితే ఇంత బిజీ ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు రజినీకాంత్ ఫ్యాన్స్ కి ఓ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు.. 


అదేంటంటే.. ఈరోజు సాయింత్రం 5 గంటలకు దర్బార్ మోషన్ పోస్టర్ ను మహేష్ బాబు రిలీజ్ చెయ్యబోతున్నాడు. ఇంకా విషయానికి వస్తే.. రజినీకాంత్ కొత్త సినిమా దర్బార్ షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి కేవలం పోస్టర్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. 


అయితే ఈరోజు సాయింత్రం 5:30 గంటలకు తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో దర్బార్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చెయ్యబోతున్నారు. దర్బార్ మోషన్ పోస్టర్ ను మలయాళంలో మోహన్ లాల్, హిందీలో సల్మాన్ ఖాన్ రిలీజ్ చేయబోతున్నారని మురుగదాస్ ప్రకటించాడు. అయితే తెలుగు, తమిళ్ భాషల్లో మోషన్ పోస్టర్ ని కమల్ హాసన్ రిలీజ్ చేస్తున్నట్టు చెప్పాడు. 


అయితే అన్ని పోస్టర్ లు ఆయా ఇండస్ట్రీలకు సంబంధించి సూపర్ స్టార్స్ రిలీజ్ చేస్తుండటంతో ఇప్పుడు తెలుగులో కూడా కమల్ హాసన్ కాకుండా మహేష్ బాబు మోషన్ పోస్టర్ విడుదల చేయనున్నారని లైకా ప్రొడక్షన్స్ సంస్థ ప్రకటించింది. దీంతో ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. కాగా రజినీకాంత్ దర్బార్ వచ్చే ఏడాది 12వ తేదీన విడుదల కానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: