అనిల్ రావిపూడి దర్శకత్వంలో
సూపర్ స్టార్ మహేష్ బాబు,
రష్మిక జోడిగా తెరకెక్కుతున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరూ'. ప్రస్తుతం ఈ
సినిమా షూటింగ్ సెరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో అప్పట్లో లేడీ బాస్
విజయశాంతి ఓ ప్రత్యేక పాత్రతో సినిమాల్లో రీఎంట్రీ ఇస్తుంది. అయితే
మహేష్ తండ్రి కృష్ణతో జతకట్టి సినిమాలు తీసిన
విజయశాంతి ఇప్పుడు
మహేష్ సినిమాతో రీఎంట్రీ ఇస్తుంది.
అయితే
మహేష్ బాబు చిన్నతనం నుండే విజయశాంతితో కలిసి సినిమాలు తీశాడు. అప్పట్లో కొడుకు దిద్దిన కాపురం వంటి చిత్రాలు వచ్చి సూపర్ హిట్ అయినా సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుండే విజయశాంతికి
మహేష్ కి మంచి బంధం ఏర్పడింది. అందుకే ఆమె
మహేష్ కి సర్ప్రైజ్ ఇస్తూ ఇంటినుండి లంచ్ తెప్పించి మరి
మహేష్ వడ్డించింది అంట..
దీంతో
మహేష్ బాబు ఒక్కసారిగా ఆనందంలో మునిగి తేలడాట. అయితే ఇలా లంచ్ తీసుకొచ్చి పెట్టె విషయంపై
విజయశాంతి స్పందిస్తూ..
మహేష్ తనని ఎప్పుడు అమ్మ అమ్మ అని ముద్దు ముద్దుగా పిలుస్తాడని, అందుకే
మహేష్ బాబు అంటే తనకు ఎంతో ఇష్టమని అందుకనే ఈరోజు లాంచ్ తీసుకొచ్చి పెట్టాను అని ఆమె చెప్పారట. దీంతో ప్రస్తుతం ఈ విషయంపై సోషల్ మీడియాలో వార్తలు భారీగా వస్తున్నాయి. కాగా ఈరోజు సాయింత్రం
తమిళ్ సూపర్ స్టార్ రజిని కాంత్
దర్బార్ చిత్రం మోషన్
పోస్టర్ ని
మహేష్ బాబు విడుదల చెయ్యనున్నారు.