టాలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్ అంటే బడబడ హీరోలకు నిర్మాతలకు చాలా స్పెషల్. తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి మూడురోజుల అతి పెద్ద పండుగ. ఈ నేపథ్యంలో సంక్రాంతిని టార్గెట్ చేసుకుని చాలామంది ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు మరియు నిర్మాతలు పక్కా ప్లానింగ్ తో సినిమాలు రెడీ చేస్తుంటారు. ఇటువంటి నేపథ్యంలో రాబోయే సంక్రాంతిని టార్గెట్ చేసుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోలైన అల్లు అర్జున్ మరియు మహేష్ బాబులు తమ తమ సినిమాలను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలా వైకుంఠపురం సినిమాతో సంక్రాంతికి రెడీ అవుతున్నారు. అంతే కాకుండా ఇద్దరు హీరోలు ఒకే రోజు సినిమా విడుదల చేయాలని డిసైడ్ అయ్యి జనవరి 12వ తారీకున విడుదల చేస్తున్నట్లు తేదీలు కూడా ప్రకటించేశారు.


దీంతో మహేష్ మరియు అల్లు అర్జున్ మధ్య పోటీ నెలకొనడం తో ఒకేరోజు సినిమాలు విడుదలైతే రెండు సినిమాల నిర్మాతలకు నష్టం వస్తుందని ఒక పక్క వార్తలు వస్తున్నాయి కానీ ఇద్దరు పంతం నేగ్గించుకోవడానికి ఒకేరోజు సినిమాలు విడుదల చేయాలని గత కొంత కాలం నుండి ఈ ఇద్దరు హీరోలు పోటాపోటీ పడుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. అంతేకాకుండా మరో పక్క సినిమాకి ఒక రోజైనా గ్యాప్ ఉండాలి అంటూ  డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కూడా అభ్యర్థనలు వస్తున్నాయి. పైగా అభిమానుల మధ్యన కూడా వాతావరణం సీరియస్ గా మారే అవకాశం లేకపోలేదు.


దీంతో మహేష్ బాబు సినిమా నిర్మాత దిల్ రాజు అదేవిధంగా బన్నీ సినిమా నిర్మాత అల్లు అరవింద్ ఇద్దరూ ప్రస్తుత పరిణామాలను అర్థం చేసుకొని ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాను జనవరి 11న రిలీజ్ చేసి.. అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురములో.. చిత్రాన్ని జనవరి 13న రిలీజ్ చేయాలనీ ఇరు నిర్మాతలు ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే థియేటర్స్ విస్తరణ విషయంలో మనస్పర్థలు తగ్గే అవకాశం ఉందని సామరస్య వాతావరణంలో సినిమా విడుదలయ్యి పండుగకు ఇద్దరు హీరోల అభిమానుల మధ్య ఎటువంటి గొడవలు కూడా జరిగవని డిసైడ్ అయ్యి సినిమా విడుదల చేయాలని రెండు సినిమాల నిర్మాతలు భావించినట్లు సమాచారం.  



మరింత సమాచారం తెలుసుకోండి: