ఇప్పటి వరకు తెలుగు తెరపై ఎంతో మంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా పరిచయం అయ్యారు. కొంత మంది
సక్సెస్ బాటలో నడిస్తే..కొంత మంది మాత్రం కెరీర్ సరిగా సాగక కనుకరుగైపోయారు. తాజాగా ఇప్పుడు
టాలీవుడ్ లోకి కొత్త
హీరో అడుగు పెట్టబోతున్నాడు. ఇంతకీ ఆ
హీరో ఎవరా అనుకుంటున్నారా..?
టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంటూ నెం.1 పొజీషన్లో ఉన్న
సూపర్ స్టార్ మహేష్ బాబు మేనళ్లుడు గల్లా అశోక్.
సినీ నేపథ్యమే కాదు..
గల్లా అశోక్ కి రాజకీయ నేపథ్యం కూడా ఉంది.
గల్లా అశోక్ ఎవరో కాదు ప్రముఖ
టీడీపీ నేత,
ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు.
సూపర్ స్టార్ కృష్ణ కూతురు పద్మావతి-గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్. గతంలో వీరు అమెరికాలో ఉండి..ఇండియాకు వచ్చిన తర్వాత అమర
రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీలకు ఆయన మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. గల్లా అరుణకుమారి తనయుడు అయిన గల్లా జయదేవ్ టీడీపీలో చేరి రాజకీయాల్లో అడుగు పెట్టారు. ప్రస్తుతం ఎంపిగా కొనసాగుతున్నారు.
ఇక తాతయ్య, మేనమామలు సినీ నేపథ్యంలో ఉండటంతో మొదటి నుంచి
గల్లా అశోక్ కి సినిమాలపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవారు. ‘భలే మంచి రోజు`, `శమంతక మణి`, `దేవదాస్` మూవీస్ తో ప్రశంసలు దక్కించుకున్న
యువ దర్శకుడు
శ్రీరామ్ ఆదిత్య ఈ
సినిమా రూపొందిస్తున్నాడు. అమర్రాజా
మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై పద్మావతి గల్లా ఈ
మూవీ నిర్మిస్తున్నారు. ఈ నెల పదో తేదీన రామానాయుడు స్టూడియోస్లో అత్యంత ఘనంగా జరుగనున్న
సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరుకాబోతున్నారు.
సూపర్ స్టార్
కృష్ణ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని
టాలీవుడ్ వెండితెరపై మరో సూపర్ స్టార్గా ఎదిగారు మహేష్ బాబు. ఆయన తనయుడు గౌతమ్ కూడా 1 నేనొక్కడినే సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. ఇక సుధీర్ బాబు, మంజుల, ఆమె కూతురు
జాన్వీ కూడా వెండితెరపై మెరిసారు. అయితే ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న
అశోక్ తెలుగు ప్రేక్షకులని ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాలి.