ఊహలు గుసగుసలాడే సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన రాశీఖన్నా ఆ సినిమా తరువాత గ్లామర్ హీరోయిన్గా మంచి ఇమేజ్ తెచ్చుకుంది. అంతేకాకుండా రాశి కి తన వాసి బాగా కలివచ్చిన్నట్లుగా ఉంది అందుకే స్టార్ హీరోల సరసన వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుని దూసుకుపోతోంది.
ఇకపోతే తొలి సినిమాలో కాస్త బొద్దుగా కనిపించినా తన అందం అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ బ్యూటీ. ఇక మొన్నామధ్య వచ్చిన సినిమాలు ప్లాప్ అవ్వటంతో అమ్మడి కెరీర్ కష్టాల్లో పడ్డట్టే అనుకున్నారు సినీ జనాలు, కానీ అనుకోకుండా సుప్రీం సినిమాతో మరో సక్సెస్ను అందుకొని టాలీవుడ్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
అదే జోరులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన జై లవ కుశ సినిమాలో నటించింది. ఇకపోతే ఈ బ్యూటీ ఈ మధ్యే కోలీవుడ్లోనూ అడుగుపెట్టి అక్కడ కూడా బిజీ అవుతుంది. కాగా ప్రస్తుతం ఈ భామ అందివచ్చిన అవకాశాలను వదలకుండా చేతినిండి సినిమాలతో యమా బిజీగా ఉంది. ఇక వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ను తన సోషల్ మీడియా పేజిలో పోస్ట్ చేసింది రాశీఖన్నా..
అందులో తాను ఎంతగానో ఎగ్జయిట్ గా ఫీలవుతున్నట్లు తెలిపింది. ఇంతకు ఈ ముద్దుగుమ్మ ఎందుకు ఎగ్జయిట్ అవుతుందనే విషయంలోకి వెళితే, వరల్డ్ ఫేమస్ లవర్ కోసం తొలిసారిగా డబ్బింగ్ చెప్పుకోవడమే దానికి కారణం. నిజానికి రాశీఖన్నా హీరోయిన్గా, సింగర్గా కూడా మెప్పించిన సంగతి తెలిసిందే.
అయితే తన సినీ కెరీయర్లో రాశీఖన్నా హీరోయిన్గా తొలిసారి చేసిన ప్రయత్నం కాబట్టి ఆమె ఎగ్జయిట్ అవుతుందట. ఇక పోతే ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జంటగా రాశీఖన్నా నటిస్తుండగా, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.