2016లో ఇంద్రగంటి మోహన
కృష్ణ దర్శకత్వంలో
నేచురల్ స్టార్ నానీ హీరోగా వచ్చిన 'జెంటిల్మెన్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది నివేదా థాంస్. ఆ తర్వాత మరోసారి
నాని తో 'నిన్నుకోరి' సినిమాలో నటించింది. ఆ తర్వాత తారక్ హీరోగా 'జైలవకుశ',
కళ్యాణ్ రాం హీరోగా '118', శ్రీ విష్ణు 'బ్రోచేవారెవరురా' సినిమాల్లో నటించింది. ఈ సినిమాలనీ సూపర్ హిట్ గానిలిచాయి. ఇక నివేదా ప్రస్తుతం నిఖిల్కి జోడీగా 'శ్వాస' సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో పాటు
నాని, సుధీర్ హీరోలుగా నటిస్తున్న ' వి ' సినిమాతోనూ బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం
సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 'దర్బార్' సినిమాలో నివేదా నటిస్తుంది. ఈ సినిమాలో
సూపర్స్టార్ రజనీకాంత్ కూతురిగా ముఖ్య పాత్రను పోషిస్తుంది. ఈ నేపథ్యంలో సరదాగా ఫ్యాన్స్తో చి చాట్ లో పాల్గొనింది నివేదా. ఇన్స్టాగ్రామ్లో చాట్ సెషన్లో పాల్గొన్న నివేదా.. దాదాపుగా అభిమానులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పింది. అయితే కొందరు మాత్రం అసభ్యకరమైన ప్రశ్నలు అడిగి తనను ఇబ్బందిపెట్టారట. ఈ విషయాన్ని నివేదా సోషల్
మీడియా ద్వారా వెల్లడిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది.
'నాతో చాట్ చేయడానికి టైం కేటాయించినందుకు అందరికీ థ్యాంక్స్. మీరు అడిగిన ఫన్నీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పి చాలా ఎంజాయ్ చేశాను. అయితే నేను కొందరు అడిగిన ప్రశ్నలను పట్టించుకోలేదు. చాలా మంది పెళ్లెప్పుడు, ఒక్క మాటలో చెప్పండి, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా.. లేరా, మీరు వర్జినా కాదా.. వంటి ఛండాలమైన ప్రశ్నలు అడిగి నన్ను బాధ పెట్టారు. ఈ ప్రశ్నలకు నేను సమాధానాలు చెప్పలేదు. మీరు మాట్లాడేది కూడా ఓ మనిషితోనేనని తెలుసుకోండి. ఇతరులకు మర్యాద ఇవ్వండి. ఏదేమైనా మీతో చాట్ సెషన్ నేను చాలా ఎంజాయ్ చేశాను. త్వరలో మళ్లీ కలుద్దాం' అంటూ ముగించిందట. సాధారణంగా యంగ్
హీరోయిన్స్ తో ఆకతాయిలు ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేసే బాధ పెడుతుంటారు. కానీ కొన్ని సార్లు తప్పదు. ఏదో ఫ్యాన్స్ సంతోషపడతారని మన
హీరోయిన్స్ కాస్త టైం తీసుకొని చిట్ చాట్ లో పాల్గొంటే చివరికి వాళ్ళే హర్ట్ అయ్యోలా నెటిజన్లు అడ్డమైన ప్రశ్నలు వేసి వేధిస్తున్నారు. గతంలో ఇలాంటి అనుభవమే
రష్మిక కి ఎదురైన సంగతి తెలిసిందే.