టాలీవుడ్ స్టైలిష్ స్టార్
అల్లు అర్జున్ గత రెండు సినిమాలతో పెద్దగా
సక్సెస్ లు లేక కెరీర్ పరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత కొంత ఆలోచనలో పడ్డ బన్నీ, ఎలాగైనా తన ఫ్యాన్స్ కు ఈ సారి మాత్రం మంచి హిట్ ఇవ్వాలని భావించి, ఇటీవల పలువురు దర్శకుల నుండి కథలు వినడం జరిగింది. అనంతరం ఫైనల్ గా
త్రివిక్రమ్ కథను ఓకే చేయడం, ఆ సినిమానే ప్రస్తుతం 'అల వైకుంఠపురములో' పేరుతో తెరకెక్కడం జరుగుతోంది. బన్నీ మరియు
త్రివిక్రమ్ ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడవ
సినిమా కావడం, అదేకాక వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి విజయాలు అందుకోవడంతో,
ఇది తప్పకుండా హ్యాట్రిక్ కొడుతుందని బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు అప్పుడే ప్రొమోషన్ ఫుల్ స్వింగ్ లో మొదలెట్టేశారు
సినిమా యూనిట్ వారు. ఇప్పటికే ఈ
సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ మరియు రెండు సాంగ్స్, ప్రేక్షకుల నుండి అత్యద్భుతమైన స్పందనను రాబట్టడంతో పాటు సినిమాపై ప్రేక్షకుల్లో తారా స్థాయిలో అంచనాలు పెంచడం జరిగింది. బన్నీ సరసన పూజ హెగ్డే
హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి టబు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇకపోతే ఈ
సినిమా నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ లో సిద్
శ్రీరామ్ ఆలపించిన సామజవరగమనా సాంగ్ ఒకటి.
ఇక ప్రస్తుతం ఈ సాంగ్ ని
ఫ్రాన్స్ దేశంలోని
పారిస్ నగరంలో అత్యంత పేరుగాంచిన 'లే లిడో' అనే ఫేమస్ డాన్స్ క్యాబ్రెట్ లో అత్యంత గ్రాండ్ గా చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ విధంగా ఆ ప్లేస్ తో తన
సినిమా సాంగ్ మాత్రమే చిత్రీకరించబడ్డ
సౌత్ హీరోగా
అల్లు అర్జున్ గొప్ప రికార్డు సంపాదించారు. ఇక లే లిడో వారు కూడా అలవైకుంఠపురములో మూవీలోని సాంగ్ ని తమ క్యాబ్రేట్ లో చిత్రీకరించడం ఎంతో సంతోషంగా ఉందని ఎంతో ఆనందం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను
సంక్రాంతి కానుకగా
జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.....!!